English | Telugu

సైలెంట్ గా ఓటీటీలోకి 'మేమ్ ఫేమస్'!

యూట్యూబర్ సుమంత్‌ ప్రభాస్‌ ను హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తూ ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఎందరో కొత్తవాళ్లు పనిచేసిన ఈ సినిమా ఈ ఏడాది మే 26న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా యూత్ ని ఈ సినిమా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

'మేమ్ ఫేమస్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. అయితే పెద్దగా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది 'మేమ్ ఫేమస్'. ఈరోజు(జూన్ 30) నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకొని బయ్యర్లకు లాభాలను మిగిల్చిన మేమ్ ఫేమస్.. ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందేమో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.