English | Telugu

'మనంసైతం' ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  

'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్ వారి స‌హ‌కారంతో 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ వ్యవస్థాపకులు కాదంబ‌రి కిర‌ణ్ నిర్వ‌హించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ''ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవ‌రికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ పండ‌గ రోజున ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల డాక్ట‌ర్ల‌తో క‌లిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వ‌హించాము. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్రామానికి శ్రీకారం చుట్టాము. గత 10 సంవ‌త్స‌రాలలో 50 వేల మంది నిస్సాహ‌యుల‌కు మా ఫౌండేషన్ నుంచి సాయం అందించాం. అలాగే సపర్య వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం, అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ప్రారంభించి సేవ చేసుకోవడంమే నా జీవిత ల‌క్ష్యం. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. 'మనంసైతం' అండ‌గా ఉంటుంది'' అని కాదంబ‌రి కిర‌ణ్ హామీ ఇచ్చారు.

న‌టుడు వినోద్‌బాల‌ మాట్లాడుతూ.. మనంసైతం కాదంబ‌రి ఫౌండేష‌న్ ‌నుంచి కాదంబ‌రి కిర‌ణ్ ఎన్నో ఏళ్లుగా ఎన్నో సేవ‌లు చేస్తున్నారు. ఆయ‌న టీంలో మేము కూడా ఇలా సేవ‌ల్లో పాలుపంచుకోవ‌డం అదృష్టంగా భావిస్తాం. చిత్ర‌పురి కాల‌నీలోని కార్మికుల‌కు వైద్య సేవ‌లు అందించ‌డం నిజంగా సంతోషంగా ఉంది. అని అన్నారు.

మనంసైతం సేవ య‌జ్ఞంలో తాము కూడా నిరంతరం పాలుపంచుకుంటామ‌ని కస్తూరి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో LIG వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులూ,ప‌లువురు న‌టీన‌టులు, వివిధ శాఖల సినీ కార్మికులు పాల్గొన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .