English | Telugu

మ్యాంగోతో వస్తున్న రాజశేఖరుడు

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకడిగా ఉండే అమ్మరాజశేఖర్, దర్శకుడిగా మారి "రణం" చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో మళ్ళీ "ఖతర్నాక్" అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత అమ్మ రాజశేఖర్ తీసిన చిత్రాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కొంత కాలం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అమ్మరాజశేఖర్ మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

కృష్ణుడు, యువన్ హీరోలుగా షమ్ము, అర్చన హీరోయిన్లుగా "మ్యాంగో" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.