English | Telugu

మహేష్ బాబుకి ఈడీ నోటీసులు!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి సూర్య, సురానా డెవలపర్స్ వంటి పలు సంస్థలకి ప్రమోటర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది.

ఈ రెండు సంస్థల నుంచి యాడ్స్ కోసం మహేష్ రూ.3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.