English | Telugu

మహేష్, బాలయ్య కాంబినేషన్‌లో కొత్త రికార్డు


సినిమా కలెక్షన్లతో పాటు శాటిలైట్ రైట్ల విషయంలోనూ ఇప్పుడూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు మన పరిశ్రమలో. లేటెస్టుగా మహేష్, బాలకృష్ణ ఇలాంటి ఒక రికార్డు తమ పేరున నమోదు చేసేశారు. వీరిద్దరి సినిమాలకు కలిపి ఒక చానల్ వారు 16 కోట్లు ఆఫర్ చేశారట. మహేష్ బాబు ‘ఆగడు’, బాలకృష్ణ ‘లెజెండ్’ఇవి రెండూ చిత్రాలు కూడా 14 రీల్స్ బ్వానర్ పై నిర్మించారు. ఈ సినిమాల రైట్స్ కొనేందుకు జెమినీ ముందుకొచ్చిందని సమాచారం. టీవిలో ప్రసారానికి ఇంత డబ్బు వెచ్చిస్తున్నారంటే, శాటిలైట్ రైట్స్ విషయంలో నెలకొన్న పోటీ గురించి, అలాగే ఆ హీరోలకున్న మార్కెట్ గురించి అంచనా వేయొచ్చు. పైరసీ వల్ల కలెక్షన్ల విషయంలో ఏదైనా నష్టం వచ్చిందనుకున్న, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడైతో ఆ నష్టం భర్తి అయినట్లే. సో లేటెస్ట్‌గా నందమూరి సింహం, ప్రిన్స్ మహేష్ ఈ కొత్త రికార్డు శాటిలైట్ హిస్టరీకి ఇచ్చేశారు.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.