English | Telugu

బాక్సాఫీస్ ఉగ్రరూపం.. వంద కోట్ల దిశగా మహావతార్ నరసింహ!

ఎప్పుడు ఏ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చెప్పలేము. ఒక్కోసారి పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయి. ఇటీవల విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రం ఆ కోవలోకే వస్తుంది. జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. (Mahavatar Narsimha)

'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న హోంబలే ఫిలిమ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. ఈ యూనివర్స్ నుంచి ఏడు సినిమాలు వస్తాయని.. మొదటి సినిమా 'మహావతార్ నరసింహ' ఈ ఏడాది వస్తుందని.. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.

'మహావతార్ నరసింహ' చిత్రం జూలై 25న విడుదలైంది. విడుదలకు ముందురోజు వరకు ప్రేక్షకుల్లో కానీ, ట్రేడ్ లో కానీ.. ఈ సినిమాపై అంచనాలు లేవు. అందరూ దీనిని ఒక మామూలు యానిమేషన్ సినిమాలాగే చూశారు. అయితే ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.

'మహావతార్ నరసింహ' సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. మొదటి వారంలోనే ఈ చిత్రం రూ.53 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డివోషనల్ ఫిల్మ్ కావడం, యానిమేషన్ వర్క్ బాగుందని టాక్ రావడం, పిల్లలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం.. వంటి కారణాలతో 'మహావతార్ నరసింహ'కు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రేక్షకులు థియేటర్ బయట చెప్పులు విప్పి మరీ లోపలికి వెళ్తున్నారంటే.. ఈ సినిమాకి వారు ఎంతలా కనెక్ట్ అవుతున్నారో అర్థంచేసుకోవచ్చు. మొత్తానికి, స్టార్స్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకోవచ్చని 'మహావతార్ నరసింహ' మరోసారి రుజువు చేసింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.