English | Telugu

మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!

2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్'(Mad)మూవీ సాధించిన సంచలన విజయం అందరకి తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకోగా,నిన్నఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square)వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 16 కోట్ల గ్రాస్ ని సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై మేకర్స్ అధికార ప్రకటన చెయ్యాల్సి ఉంది.మూవీకి అయితే ప్రేక్షకుల దగ్గరనుంచి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.దీంతో వీకెండ్స్ లో భారీగా కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు అంచనా వేస్తున్నారు.

మ్యాడ్ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)'మ్యాడ్ స్క్వేర్'కి కూడా దర్శకత్వం వహించాడు.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ(Naga vamsi)ఫస్ట్ పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ ని నిర్మించగా నార్నేనితిన్(Narne Nithin)సంగీత్ శోభన్,రామ్ నితిన్,ప్రియాంక జవాల్కర్,విష్ణుఓయ్,మురళిధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.భీమ్స్ సిసిరోలియో(Bheems ceciroleo)సంగీతాన్నిథమన్(Thaman)బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.