English | Telugu

మంచు లక్ష్మీకి జ్ఞానోదయం

ఎప్పుడూ, ఏం మాట్లాడినా కూడా "డాడీ" అనే పదం రాకుండా మాట్లాడని లక్ష్మీ ప్రసన్న తాజాగా తన తండ్రిపై ఇక ఆధారపడకూడదని నిర్ణయం తీసుకుంది. అసలు విషయం ఏమిటంటే... "ఇప్పటివరకు నేను చేసినవాటిలో కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోలేదు. ఇకనుంచి అలా చేయదల్చుకోలేదు. మా నాన్నగారు ధనవంతులే. కానీ, నేను కాదు. ఇంకా ఆయన మీద ఆధారపడితే ఏం బాగుంటుంది? నాకూ కుటుంబం ఉంది కదా. అందుకే, మంచి పాత్ర, అందుకు తగ్గ పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను చేస్తాను" అని లక్ష్మీ స్పష్టం చేసింది.

అసలు లక్ష్మీ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంత సడెన్ గా లక్ష్మీకి తన కుటుంబం ఎందుకు గుర్తుకు వచ్చింది? అంటే ఇన్ని రోజులు మెట్టినిల్లు గురించి మర్చిపోయిందా? ఏమో ఎవరికీ తెలుసు.

లక్ష్మీ నటించిన "చందమామ కథలు" విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై లక్ష్మీ చాలా నమ్మకంతో ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.