English | Telugu

'కిష్కింధపురి' మూవీ ఫస్ట్ రివ్యూ!

కంటెంట్ బాగుంటే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల ప్రచార చిత్రాలతో అలాంటి కంటెంట్ ఉన్న సినిమా అనే నమ్మకాన్ని కలిగించింది 'కిష్కింధపురి'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. అయితే అవుట్ పుట్ మీద నమ్మకంతో ముందుగానే ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 10 సాయంత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి, మీమర్స్ కి స్పెషల్ షో వేశారు. 'కిష్కింధపురి' చూసిన వారిలో మెజారిటీ మెంబర్స్.. సినిమా బాగుందని చెబుతుండటం విశేషం. (Kishkindhapuri)

'కిష్కింధపురి' అసలు కథలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకుందట. మొదటి 15 నిమిషాలు నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే అసలు కథ మొదలవుతుందో.. అప్పటినుంచి ఒక్కసారిగా సినిమా తీరు మారిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందోన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ.. కథనం పరుగులు పెట్టిందని అంటున్నారు. హారర్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉందట. ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సర్ ప్రైజ్ లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందట. క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పించిందని అంటున్నారు.

హారర్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అనేవి చాలా కీలకం. ఆ పరంగా చూస్తే.. 'కిష్కింధపురి' సినిమాకి బీజీఎం, విజువల్స్ ప్రధాన బలంగా నిలిచాయట. నటీనటుల విషయానికొస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేశాడని, ఇక అనుపమ పరమేశ్వరన్ అయితే తన నటనతో సర్ ప్రైజ్ చేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి 'కిష్కింధపురి'కి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే.. బెల్లంకొండ ఖాతాలో హిట్ పడినట్లే అని చెప్పవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.