English | Telugu

కాంతార మరో నటుడి మృతి.. వరుసగా ఎందుకు చనిపోతున్నారు 

'రిషబ్ శెట్టి'(Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార'(Kantara)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంతార' కి ఫ్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)ముస్తాబవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని రిషబ్ శెట్టి అత్యంత భారీ వ్యయంతో,ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి 'కాంతార' కి సంబంధం ఉన్న నటీనటులు వరుసగా మరణిస్తు వస్తున్నారు.

ఆ కోవలోనే రీసెంట్ గా 'కాంతార'లో మహాదేవ క్యారక్టర్ లో కనిపించిన 'టి ప్రభాకర్ కళ్యాణి'(T. Prabhakar Kalyani)గుండెపోటుతో తన నివాసంలో మృతి చెందాడు. తొలుత నాటక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాకర్, ఆ తర్వాత, సినిమాల్లోకి ప్రవేశించి అనేక చిత్రాల్లో నటించాడు. ఆయనకి భార్య, కుమారుడు ఉండగా, కొన్ని రోజుల క్రితం ప్రభాకర్ కి హార్ట్ ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది.కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడికా 'ప్రభాకర్' స్వస్థలం.

కాంతార చాప్టర్ 1 కి సంబంధించి మే నెలలో ముప్పై నాలుగు సంవత్సరాల 'రాకేష్ పూజారి'(Rakesh Poojary)గుండెపోటుతోనే మరణించాడు. ఇదే నెలలో పాతికేళ్ళు కూడా లేని జూనియర్ ఆర్టిస్ట్, కాంతారా షూటింగ్ ని ముగించుకొని ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న ఒక నదిలో ఈతకి దిగి చనిపోయాడు. జూన్ లో 'కళాభవన్ నిజూ'(Kalabhavan Niju)అనే మరో ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు.ఈ విధంగా కాంతార సిరీస్ లో నటించిన వాళ్ళందరు వరుసగా చనిపోతుండటం వైరల్ గా మారింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.