English | Telugu

సూర్య కంటే విజయ్ బెటర్..జ్యోతిక రిప్లైకి మైండ్ బ్లాంక్ 

స్టార్ హీరో సూర్య(Suriya)ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్(karthik Subbaraj)దర్శకత్వంలో 'రెట్రో' మూవీతో పాటు,ఆర్ జె బాలాజీ(Rj Balaji)దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకి సంబంధించిన షూటింగ్ లోను బిజీగా ఉన్నాడు.'లక్కీ భాస్కర్' తో విజయాన్ని అందుకున్న'వెంకీ అట్లూరి'(Venki atluri)దర్శకత్వంలోను ఒక మూవీ చేస్తున్నాడనే టాక్ అయితే ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.

సోషల్ మీడియాలో రీసెంట్ గా ఒక నెటిజన్ సూర్య కంటే విజయ్(Vijay)బెటర్,ప్రదీప్ రంగనాధన్ (Pradeep Ranganadhan)సినిమా కలెక్షన్స్ లని, సూర్య గత చిత్రానికి సంబంధించిన కలెక్షన్స్ తో పోలుస్తు కూడా కామెంట్ చేసాడు.ఇప్పుడు ఆ కామెంట్స్ కి సూర్య వైఫ్, ఒకప్పటి హీరోయిన్ 'జ్యోతిక' నవ్వు ఎమోజి ని పోస్ట్ చేసింది.దీంతో ఇప్పుడు జ్యోతిక చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. జ్యోతిక, సూర్య 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అంతకు ముందు ఈ ఇద్దరు కొన్నిసినిమాల్లో జంటగా కూడా నటించారు.కొన్ని నెలల క్రితం ఆ ఇద్దరు విడిపోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవి ఒట్టి పుకార్లే అని సూర్య, జ్యోతిక వెల్లడి చేసారు.ప్రస్తుతం ఈ జంట ముంబై లో నివాసం ఉంటుంది.

జ్యోతిక ప్రస్తుతం 'డబ్బాకార్టెల్'(Dabba Cartel)అనే హిందీ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో చేస్తుంది. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగాస్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో జ్యోతిక ఫుల్ బిజీగా ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.