English | Telugu

కిరీటి అసలైన బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఎంతో మందికి అండగా ఉన్నాడు 

ఈ రోజు తెలుగుతో పాటు కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'జూనియర్(Junior)'. ప్రతిష్టాత్మక బ్యానర్ 'వారాహి' సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా 'కిరీటి'(Kireeti)హీరోగా తొలిసారి సినీ ఆరంగ్రేటమ్ చేసాడు. శ్రీలీల హీరోయిన్ కాగా ఒకప్పటి కన్నడ స్టార్ హీరో 'రవిచంద్రన్'(Ravi Chandran)కిరీటి తండ్రిగా కనిపించడం విశేషం. రాధాకృష్ణ రెడ్డి (Radhakrishna Reddy)దర్శకుడిగా వ్యవహరించగా, దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ మూవీ ప్రచార చిత్రాలు రిలీజైన దగ్గర్నుంచి 'కిరీటి' గురించి ప్రత్యేకమైన చర్చ నడుస్తుంది. దీంతో చాలా మంది కిరీటి బ్యాక్ గ్రౌండ్ గురించి 'గూగుల్' లో సెర్చ్ చేస్తున్నారు. కిరీటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బిజెపి పార్టీ సభ్యుడు మాజీ మంత్రి 'గాలి జనార్దన్ రెడ్డి'(Gali Janardhan Reddy)కి ఒక్కగానొక్క కొడుకు. తల్లి పేరు అరుణ లక్ష్మి. కొన్ని కోట్ల ఆస్తులకి ఏకైక వారసుడు. సోదరి బ్రాహ్మణికి చాలా సంవత్సరాల కిందటే వివాహం జరుగగా, ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే బిజినెస్ పనులు చూసుకుంటు ఉంది. కిరీటి విద్యాబ్యాసం ఇంటర్ వరకు బెంగుళూర్ లోనే జరగగా, ఆ తర్వాత లండన్ లో 'హానర్స్ అండ్ పాలిటిక్స్ లో బిజినెస్ మేనేజ్ మెంట్' చేసాడు.

నటనలో ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్ ని ఇష్టపడే కిరీటి కి చిన్నపట్నుంచి హీరో కావాలని ఉండేది. ఆ దిశగానే ఎంతో కష్టపడి డాన్స్, ఫైట్స్ లో శిక్షణ పొందాడు. మెంటల్లీ ఛాలెంజెడ్ స్పెషల్ ఏబిల్డ్ పిల్లలు ఆరువందల మంది దాకా చదివిస్తున్నాడు. 250 మంది వృద్దులకు ఆశ్రయం కల్పించాడు. రాజకీయాల్లో మాత్రం ఆసక్తి లేదు. మంచి నటుడుగా నిబడాలనేది కిరీటి లక్ష్యం. ఇక జూనియర్ మూవీలో కిరీటి పెర్ ఫార్మెన్స్ , డాన్స్ లకి మంచి పేరు వస్తుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.