English | Telugu

'అమిగోస్' చూసి ఎన్టీఆర్ ఫిదా!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో 'అమిగోస్'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. విడుదలకు ముందే ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చూసి ఫిదా అయినట్లు తెలుస్తోంది.

ఇటీవల కళ్యాణ్ రామ్, దర్శకుడు రాజేంద్ర రెడ్డితో పాటు ఇతర మూవీ టీమ్ తో కలిసి 'అమిగోస్' చిత్రాన్ని వీక్షించిన తారక్.. సినిమా చాలా బాగుందని టీమ్ ని మెచ్చుకున్నాడట. ముఖ్యంగా దర్శకుడి పనితీరుని ప్రత్యేకంగా అభినందించాడట. 'బింబిసార' తర్వాత తన అన్న కళ్యాణ్ రామ్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అనుకుంటే.. ఈ 'అమిగోస్' చిత్రం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని సంతోషం వ్యక్తం చేశాడట.

కళ్యాణ్ రామ్ గత చిత్రం 'బింబిసార' సమయంలో కూడా ఎన్టీఆర్ ఇలాగే ముందుగానే సినిమా చూసి.. చాలా బాగుందని, ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నాడు. ఆయన అన్నట్లుగానే 'బింబిసార' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'అమిగోస్' విషయంలో కూడా ఎన్టీఆర్ అంచనా నిజమవుతుందేమో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.