English | Telugu

'జటాధర' ట్రైలర్.. సుధీర్ బాబు విశ్వరూపం!

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'జటాధర'. ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. (Jatadhara Trailer)

'జటాధర' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గుప్తనిధుల అంశాన్ని ముడిపెడుతూ.. దైవ శక్తికి, పిశాచానికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంది. "పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి.. మంత్రాలతో బంధనాలు వేసేవారు. ఆ బంధనాలలో అతి భయంకరమైనది పిశాచ బంధనం" అనే వాయిస్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. దెయ్యాలను నమ్మని ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. లంకె బిందెలకు కాపలాగా ఉండే ధన పిశాచిగా సోనాక్షి సిన్హా కనిపిస్తోంది. దెయ్యాలను నమ్మని హీరో.. ధన పిశాచితో తలపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? శివుడి ఆశీస్సులతో హీరో ఎలా పోరాడాడు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ఇక ట్రైలర్ చివరిలో నేల మీద పడుకొని రక్తం తాగుతున్నట్టుగా సుధీర్ బాబు పాత్రని చూపించడం సర్ ప్రైజింగ్ ఉంది. మొత్తానికి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. విజువల్ గా కూడా బాగానే ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం