English | Telugu

త‌లైవాని చూసి... నువ్వు కావాల‌య్యా అంటున్న త‌మ‌న్నా!

ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న సినిమా జైల‌ర్‌. త‌మ‌న్నా నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ని ఈ నెల 6న విడుద‌ల చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఫ‌న్ ప్రోమో రిలీజ్ చేశారు నెల్స‌న్ అండ్ అనిరుద్‌. సినిమా సాంగ్ రిలీజ్ ఉంద‌ని అనిరుద్‌కి నెల్స‌న్ మెసేజ్ పెడ‌తారు. నేరుగా వెళ్లి క‌లుస్తారు. అయితే, ముందు సాంగ్ ప్రోమో రిలీజ్ చేద్దామ‌ని స‌జెష‌న్ ఇస్తారు అనిరుద్‌. అలాంటివేం వ‌ద్దు, నేరుగా పాటే రిలీజ్ చేద్దామ‌ని క‌చ్చితంగా చెబుతారు నెల్స‌న్‌. ఇలా వారిద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ జ‌రుగుతుంటుంది. ఏ పాట అని అనిరుద్ అడిగితే, నీకు న‌చ్చిన త‌మ‌న్నా పాట అని అంటారు నెల్స‌న్‌. నాకు న‌చ్చుతుందా? అని అనిరుద్ అడిగితే, మ‌న‌కు నచ్చుంద‌ని అంటారు నెల్స‌న్‌. 70 శాతం త‌మిళ్‌, 30 శాతం తెలుగు ప‌దాలు ఉండేలా ఈ సాంగ్‌ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడే పాట రాస్తున్న‌ట్టు కూడా ఈ వీడియోలో చూపించారు.

ఆద్యంతం ఫ‌న్నీగా సాగిన ఈ వీడియో ర‌జ‌నీ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా ఉంది. వా... నువ్వు కావాల‌య్యా అంటూ ఫీమేల్ వాయిస్‌లో ప్రోమో రిలీజ్ చేశారు. విన‌డానికి క్యాచీగా ఉంది సాంగ్‌. ఇప్పుడు జీ క‌ర్దా, ల‌స్ట్ స్టోరీస్‌తో జోరుమీదున్న త‌మ‌న్నా ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం క‌నిపించింది వీడియోలో. ర‌జ‌నీ ఊసే లేక‌పోవ‌డం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింద‌ని అంటున్నారు ఫ్యాన్స్. ర‌జ‌నీ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అవుతున్న అదే రోజు ప్ర‌భాస్ స‌లార్ టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఆ రోజు ఈ రెండు సినిమాల ట్రెండింగ్ తో ట్విట్ట‌ర్‌లో పోటీ మామూలుగా ఉండ‌ద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.