English | Telugu

బాహుబలి మగధీరకు సీక్వెల్?

రాజమౌళికి మగధీర వాసన పోలేదా? అటు ఇటుగా మగధీరకు సీక్వెల్ తీస్తున్నాడా? బాహుబలి ట్రైలర్ చూసనవారంతా ఇదే విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు. సైనికాధిపతిగా లుక్, రాజ్యం, వార్ ఎపిసోడ్ ఇలా ప్రతి విషయంలోనూ పోలిక కనిపిస్తోందంటున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బాహుబలి కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కినట్టుందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బాహుబలి ట్రైలర్లో ప్రభాస్ 'నేనెవర్ని' అని ప్రశ్నించడం ఈ వాదనకు ఊతమిస్తోంది. అంతో ఇంతో ఉన్న కాస్త తేడా ఏంటంటే మగధీర కన్నా బాహుబలి విజువల్ బెటర్ గా ఉందంటున్నారు. అయితే సినిమా ఫస్ట్ లుక్ నుంచి పోస్టర్ వరకూ కాపీ మాస్టర్ గా విమర్శలు ఎదుర్కొన్న రాజమౌళికి బాహుబలి ఎలాంటి ట్రీట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.