English | Telugu

ప్రభాస్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

ఇటీవల 'కల్కి 2898 AD'తో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో.. 'రాజా సాబ్', 'ఫౌజీ', 'కల్కి 2', 'సలార్ 2', 'స్పిరిట్' ఇలా పలు భారీ సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాలను ప్రభాస్ ముందు పూర్తి చేస్తాడని అంటున్నారు. ఈ రెండు పూర్తయ్యాక మిగతా సినిమాలపై దృష్టి పెట్టే అవకాశముందట. ఇదిలా ఉంటే వీటితో పాటు మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'రావణం' అనే మైథలాజికల్ ఫిక్షనల్ మూవీని గతేడాది ప్రారంభంలో దిల్ రాజు ప్రకటించారు. ఏడాది దాటిపోయినా ఇంతవరకు ఆ సినిమాకి సంబంధించిన ఊసే లేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇప్పటికే 'సలార్' వచ్చింది. 'సలార్ 2' కూడా ప్రకటించారు.. కానీ, అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలీదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. దానికి తోడు ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఇది కూడా రెండు భాగాలుగా రానుందని టాక్. ఇది చాలదు అన్నట్టు.. అజిత్, రామ్ చరణ్ వంటి హీరోలతో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీస్ ఉంటాయని అంటున్నారు. అటు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు, ఇటు ప్రశాంత్ నీల్ కమిట్ మెంట్స్ పూర్తయి.. 'సలార్ 2' నే ఎప్పుడు మొదలవుతుందో అనే సస్పెన్స్ నెలకొంది. ఈ లెక్కన అసలు 'రావణం' ప్రాజెక్ట్ ని పూర్తిగా మర్చిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'రావణం' సినిమా దాదాపు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అది మొదలు కావడానికే కొన్నేళ్లు పట్టే అవకాశముంది. అందుకే కొంతకాలంగా దిల్ రాజు సైతం ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి చప్పుడు చెయ్యట్లేదు.

'రావణం'తో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంతో 'జటాయు', శైలేష్ కొలను డైరెక్షన్ లో 'విశ్వంభర' సినిమాలు చేయనున్నట్లు కూడా గతేడాది దిల్ రాజు ప్రకటించారు. 'రావణం' మాదిరిగానే ఆ రెండు సినిమాల గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. పైగా 'విశ్వంభర' టైటిల్ తో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. మరి దిల్ రాజు ఎంతో గర్వంగా ప్రకటించిన ఈ మూడు సినిమాలు ఆగిపోయాయో లేక భవిష్యత్ లో ఉంటాయో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.