English | Telugu

ప‌వ‌న్ సినిమాకు పిచ్చ క్రేజ్‌

టాలీవుడ్‌లో ముస్తాబ‌వుతున్న మ‌రో క్రేజీ చిత్రం.. గోపాల గోపాల‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కృష్ణుడు అన‌గానే ఈ సినిమాపై అంచ‌నాలు ఎక్క‌డికో వెళ్లిపోయాయి. పైగా అత్తారింటికి దారేది త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఆయె. అందుకే ఈ సినిమాపై అటు ప్రేక్ష‌కులు ఇటు బ‌య్య‌ర్లు.. మొత్తానికి టాలీవుడ్ అంతా దృష్టి పెట్టింది. ఎప్పుడో సంక్రాంతికి వ‌చ్చే సినిమా ఇది. కానీ అప్పుడే బిజినెస్ మొద‌లైపోయింది. నైజాంలో ఈసినిమా రూ.15 కోట్లు ప‌లుకుతోంద‌ట‌. ఇక్క‌డ అత్తారింటికి దారేది దాదాపుగా రూ.20 కోట్లు వ‌సూలు చేసింది. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే రికార్డ్‌. అదే భ‌రోసాతో ఈ సినిమాని కొనుక్కోవ‌డానికి బ‌య్య‌ర్లు ముందుకొస్తున్నార్ట‌. మొత్త‌మ్మీద ఈజీగా రూ.50 కోట్ల బిజినెస్ జ‌రిగిపోతుంద‌ని నిర్మాత‌లు లెక్క‌లు వేసుకొంటున్నారు. దాంతో ఈ సినిమా విడుద‌ల‌కు ముందే లాభాల్ని సంపాదించిన‌ట్టైంది. ఎందుకంటే.. ఈ సినిమాకి ఇద్ద‌రు నిర్మాత‌లు. ఒక‌రు డి.సురేష్‌బాబు, ఇంకొక‌రు శ‌ర‌త్ మ‌రార్‌. సురేష్‌బాబు వెంకీనీ, శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌నీ పెట్టుబ‌డిగా వాడుకొంటున్నారు. వీరిద్ద‌రి పారితోషికాలు మిన‌హాయిస్తే ఈ సినిమాకి రూ.15 కోట్లు కూడా ఖ‌ర్చు కావు. సో.. రూ.35 కోట్లు మిగులున్న‌మాట‌. ఇంకా ఓవ‌ర్సీస్ హ‌క్కులు, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. సో.. వాటి ద్వారా వ‌చ్చిన‌దంతా ఈ ప్రొడ్యూస‌ర్ల ఖాతాకే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.