English | Telugu

మ‌హేష్‌ని అంత మాటంటాడా??

తేజ‌ది కాస్త త‌ల‌తిక్క వ్య‌వ‌హార‌మే. కంట్రోల్‌లో ఉండి మాట్లాడ‌డం చేత కాదు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ని ప‌ట్టుకొని నోటుకొచ్చిన‌ట్టు మాట్లాడాడు. మ‌హేష్‌.. ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకొన్న‌ది టాక్స్‌లో బెనిఫెట్ కోస‌మే అంటూ ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశాడు. ''ఒక్క‌డు సినిమా హిట్ట‌యిన‌ప్పుడే.. ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌చ్చు క‌దా, ఇప్పుడు తీసుకోవ‌డంలో ఆంత‌ర్యం ఏంటి? గ‌వ‌ర్న‌మెంట్లు టాక్స్ లో ఏదో బెనిఫిట్ ఇస్తామ‌ని చెప్పుంటారు'' అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్య టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది.

మ‌హేష్ ఫ్యాన్స్ తేజ అంటే మండిప‌డుతున్నారు. నిజానికి మ‌హేష్‌, తేజ‌ల మ‌ధ్య మంచి బంధ‌మే ఉంది. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో నిజం వ‌చ్చింది. ఆ సినిమా హిట్టు కాక‌పోయినా మ‌హేష్‌కి ఉత్త‌మ‌న‌టుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ సినిమా గురించి తేజ ద‌గ్గ‌ర ఎప్పుడు ప్ర‌స్తావించినా కాస్త అంసంతృప్తితోనే మాట్లాడేవాడు. రాంగ్ టైమ్ లో తీసిన సినిమా అని చెప్తుండేవాడు. మ‌హేష్ తో ఎంత అవినావ‌భావ సంబంధం ఉన్నా, ఇద్ద‌రూ ఎంత క్లోజ్ అయినా ఇలాంటి కామెంట్లు చేయ‌డం మాత్రం భావ్యం కాదు.

ఎందుకంటే.. ఊరి ద‌త్త‌త అనేది ఓ ఉద్య‌మంగా న‌డుస్తున్న రోజులివి. ఓ హీరో వ‌ల్ల ఓ ఊరు బాగుప‌డినా చాలు కదా. దాన్నీ ఇలా భూత‌ద్దాల్లో పెట్టుకొని చూడ‌డం ఎందుకు? మ‌రి ఈ కామెంట్ల ప‌ట్ల మ‌హేష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.