English | Telugu

కాలి నడకన కొండమీదకి బాలీవుడ్ అగ్ర హీరోయిన్..కొండ మీద విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ  

ఎన్నో సినిమాల్లో తన అధ్బుతమైన నటనతో భారతీయ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన నటీమణి దీపికా పదుకొనె. ఆమె తెలుగులో డైరెక్ట్ గా సినిమా చెయ్యకపోయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో కూడా దీపికా కి క్రేజ్ ఉంది.ప్రముఖ నటుడు రణబీర్ సింగ్ ని వివాహం చేసుకున్న దీపికా ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడ్ని దర్శించుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.

దీపికా పదుకొనె ఈ రోజు అలిపిరి మెట్ల ద్వారా కాలి నడకన తిరుమల చేరుకొని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని విఐపి ప్రారంభ సమయంలో దర్శనం చేసుకుంది. అనంతరం ఆమెకి పండితులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలని అందచేశారు. దీపికా ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ చిత్రంలో నటిస్తుంది.ఆ సినిమా విజయంతం కావాలని వచ్చిందేమో అని అందరు అనుకుంటున్నారు. దీపికా తిరుమల పర్యటనకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీపికా ఇంతకు ముందు కూడా చాలా సార్లు తిరుమల వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంది.

అలాగే ఇటీవలే కొత్తగా పెళ్లి జరుపుకున్న ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు మనవడు ప్రముఖ హీరో అభిరామ్ దంపతులతో పాటు రామానాయుడు కొడుకు సురేష్ బాబు దంపతులు కూడా వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకొని స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు రంగనాయక మండపంలో వారందర్ని ఆశీర్వదించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలని అందచేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.