English | Telugu

కల్కి పార్ట్ 2 నుంచి తొలగించడంపై దీపికా రియాక్షన్ ఇదే

ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించిన నటిగా, భారతీయ సినీ రంగంలో 'దీపికా పదుకునే'(Deepika Padukune)కి సుదీర్ఘమైన అనుభవం ఉంది. 2006 లో కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో తన సినీ జర్నీని ప్రారంభించి, ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో 'నెంబర్ వన్ హీరోయిన్' టాగ్ లైన్ ని సైతం పొందింది. సినిమా విజయం తాలూకు రేంజ్ ని పెంచగల సమర్థురాలు కూడా. కారణాలు తెలియదు కానీ, కల్కి 2898 ad పార్ట్ 2 నుంచి దీపికాని తొలగిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్నీ అధికారకంగా ధ్రువీకరిస్తూ 'జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాక మేం ఎవ‌రి దారిన వారు వెళ్లాల‌నుకున్నాం. మొద‌టి సినిమా కోసం చాలా దూరం క‌లిసి ప్ర‌యాణించినా, మేం స‌రైన భాగ‌స్వామ్యాన్ని క‌నుక్కోలేక‌పోయాం. దీపిక‌ భవిష్యత్ విష‌యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం' అని వైజ‌యంతి సంస్థ ప్ర‌క‌టించింది.. కల్కి మొదటి భాగం క్లైమాక్స్ చూసిన తర్వాత, సెకండ్ పార్ట్ లో దీపికా రోల్ కి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక రకంగా పార్ట్ 2 లాంటి ప్రెస్టేజియస్ట్ మూవీ,ఆమె కెరీర్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. కానీ ఆమెని తొలగించడం ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది

దీపికా ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో అని అందరు ఎదురు చూస్తు వస్తున్నారు. గతంలో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sundeep Reddy)ల 'స్పిరిట్'(Spirit)మూవీ నుంచి తప్పించినపుడు, వ్యక్తుల గురించి ప్రస్తావించకుండా, సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో దీపికా ఎలా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. రీసెంట్ గా దీపికా సోషల్ మీడియా వేదికగా ఒక సినిమా తీసే అనుభ‌వం,ఆ సినిమా చేసే వ్య‌క్తులు, దాని విజ‌యం కంటే చాలా ముఖ్యం. అంత‌కుమించి అంగీక‌రించ‌లేను. అప్ప‌టి నుంచి నేను ఇదే నియ‌మాన్ని అనుస‌రిస్తున్నాను అని క్రిప్టిక్ పోస్ట్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

దీపిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee),సన్ పిక్చర్స్(Sun Pictures)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో చేస్తుంది.దీంతో పాటు షారుక్ అప్ కమింగ్ మూవీ 'కింగ్' లో చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. షూటింగ్ కి సంబంధించి కాల్ షీట్స్ లో దీపికా కొన్ని కండిషన్స్ చెప్తుందని, అందుకే ఆమెని స్పిరిట్ నుంచి తప్పించారని ప్రచారమైంది. దీపికా తన కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకొని భారతీయ సినీ ప్రపంచం యొక్క పేరు ప్రఖ్యాతులని ప్రపంచ సినీ యవనిక పై నిలబెట్టింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.