English | Telugu

చిరంజీవి ట్వీట్ ప్రధాని మోదీ కోసమే..ఇక నెంబర్ వన్ అవ్వడమే లక్ష్యం 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)రీసెంట్ గా జూమ్ కాల్ లో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)నిర్వహించిన,వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (Waves ) లో పాల్గొనడం జరిగింది.


ఇప్పుడు ఈ విషయంపై చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు,వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(Waves )కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం మరియు ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి నా సూచనలు పంచుకోవడం నిజంగా ఒక విశేషం.మీ మెదడు నుంచి పుట్టిన,WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.సాఫ్ట్ పవర్ గా ప్రపంచంలోనే అతి త్వరలోనే సరికొత్త పుంతలు తొక్కుతు అత్యంత ఎత్తుకి ఎదుగుతుందని తెలిపాడు.

ఇక వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)అనేది మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్.ముఖ్యంగా ఇది భారతీయ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీపై దృష్టి సారిస్తుంది. ప్రకటనలు,గేమింగ్,కంటెంట్ ఉత్పత్తి, యానిమేషన్ మరియు సంగీతంలో అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఒక వేదికను కూడా అందిస్తుంది.కంటెంట్ సృష్టి,ఫైనాన్సింగ్‌లో వ్యూహాత్మక సహకారాలు,ప్రతిభ అంతరాలను పరిష్కరించడం, స్థానికీకరణ మరియు విలువైన IPలను సృష్టించి,పెట్టుబడులను ఆకర్షించడం,భారతదేశాన్ని ఒక ఆవిష్కరణ కేంద్రంగా,వినోదంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడమే Waves ప్రధాన లక్ష్యం.రజనీకాంత్,అమితాబచ్చన్,అమీర్ ఖాన్,ఏఆర్ రెహ్మాన్, వంటి సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకి చెందిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.