English | Telugu

రామోజీరావు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. ఆ రోజు ఇంటికి కేక్ పంపించి కోయించారు 

ప్రముఖ సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ అధినేత,'రామోజీరావు'(Ramoji Rao)గారు, బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి 'ఈటీవీ' (Etv)అనే ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసిందే. 1995 అగస్ట్ 27 న ప్రారంభమైన 'ఈటీవీ' ప్రస్తుతం పలు ఛానల్స్ ని అనుసంధానంగా చేసుకొని భారతదేశంలోని పలు భాషల్లో విస్తరించి ఉంది. సదరు చానల్స్ లో వచ్చే కార్యక్రమాలన్నీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తు వస్తున్నాయి. రీసెంట్ గా ఈటీవీ 30 వ వార్షికోత్సవ వేడుకలు ఫిలింసిటీలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు 'ఈటీవీ' 30 వ వార్షికోత్సవ సభకి రావడం నా భాద్యత. 1995 లో జరిగిన ఈటీవీ ప్రారంభ వేడుక నా కళ్ళ ముందు ఉంది. మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా రావడంతో పాటు 20 వ వార్షికోత్సవానికి కూడా వచ్చాను. కొవిడ్ కారణంగా 25 వ వార్షికోత్సవం చేయలేకపోయారు. కానీ నా మీద ప్రేమతో మా ఇంటికి కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. ఆ సమయంలో నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మళ్ళీ ఈ వేడుకలో భాగం కావడం నా అదృష్టం.

రామోజీరావు గారు నాకెప్పుడు స్ఫూర్తే. ఎప్పుడు కలిసినా, ఆయన చెప్పే మాటల ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే వాడ్ని. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన రామోజీరావు గారు, మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, చరిత్ర సృష్టించాలని భావించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ తో అనుకున్నట్టుగానే ఆయన తన పేరుని చరిత్రలో శాశ్వతంగా ఉండేలా చేసుకున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(K.Raghavendrarao)నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)కీరవాణి(Keeravani)ఖుష్భు(Kushboo),మురళి మోహన్(Murali Mohan)తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.