English | Telugu

వరుస దాడులు.. ఓజీ, కాంతార సినిమాలు నిలిపివేత.. ఇదంతా ఎవరి పని?

వరుస దాడులు జరుగుతుండంతో కెనడాలోని ఒక థియేటర్.. భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలోని ఓక్ విల్లే ప్రాంతంలో ఫిల్మ్.కా థియేటర్ వద్ద వారం వ్యవధిలో రెండు సార్లు దాడులు జరిగాయి. మొదట సెప్టెంబర్ 25న దాడి జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్ కు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అక్టోబర్ 2న మరో దాడి జరిగింది. తెల్లవారుజామున ఒక వ్యక్తి థియేటర్ ముందు కాల్పులు జరిపాడు. ఇండియన్ సినిమాలు ప్రదర్శిమతమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని, అందుకే వాటిని నిలిపి వేస్తున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. దీంతో 'ఓజీ', 'కాంతార చాప్టర్ 1' సినిమాల ప్రదర్శన అక్కడ నిలిచిపోయింది.

ఈ దాడుల వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఫిల్మ్.కా థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. మరి అందులో వాస్తవమెంతో తెలియదు కానీ, ఇది యార్క్ సినిమాస్ పని కూడా అయ్యుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ

'ఓజీ', 'కాంతార చాప్టర్ 1' సినిమాలను కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే 'ఓజీ' విడుదల సమయంలో ప్రత్యంగిరా సినిమాస్, యార్క్ సినిమాస్ మధ్య వివాదం నెలకొంది. ప్రత్యంగిరా సినిమాస్ పై పలు ఆరోపణలు చేయడమే కాకుండా, 'ఓజీ' సినిమాని ప్రదర్శించేది లేదని యార్క్ సినిమాస్ ప్రకటించింది. దీంతో ఫిల్మ్.కా థియేటర్ పై దాడులకు, ఈ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసిన 'ఓజీ', 'కాంతార చాప్టర్ 1' సినిమాల విడుదల తేదీలైన సెప్టెంబర్ 25, అక్టోబర్ 2నే ఈ దాడులు జరిగాయి. పైగా, తాము ఇండియన్ సినిమాల స్క్రీనింగ్ నిలిపి వేస్తున్నట్లు తాజాగా యార్క్ సినిమాస్ కూడా ప్రకటించింది.

మరి ఫిల్మ్.కా థియేటర్ దాడుల వెనుక ఖలిస్తానీ ఉగ్ర వాదుల హస్తం ఉందా? లేదా ఇది యార్క్ సినిమాస్ పనా? లేదంటే దీని వెనుక ఇంకేవరైనా ఉన్నారా? అనేది త్వరలోనే పోలీసులు తేల్చే అవకాశముంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.