English | Telugu

'బబుల్ గమ్' ట్రైలర్.. మరో 'అర్జున్ రెడ్డి' అయ్యేలా ఉంది!

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. మహేశ్వరీ మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' చిత్రాలతో ఆకట్టుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాకి దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో 'అర్జున్ రెడ్డి'లా ఉందనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా 'బబుల్ గమ్' ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'బబుల్ గమ్' ట్రైలర్ యూత్ మెచ్చేలా ఉంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు, ఒక రిచ్ అమ్మాయితో ప్రేమలో పడటం.. వీరి ప్రేమ కథలోకి మరో వ్యక్తి రావడం.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ రూపొందింది. అమ్మాయి ప్రేమ కోసం తపించే యువకుడిగా రోషన్ కనిపిస్తున్నాడు. ప్రేమలో విఫలమై, ఆ బాధ నుంచి బయటపడి తానేంటో నిరూపించుకోవాలి అనుకుంటాడు.ట్రైలర్ ని బట్టి సినిమా బోల్డ్ గా ఉండబోతుందని అర్థమవుతోంది.మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ కంటెంట్ యూత్ కి కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవడం ఖాయమనిపిస్తోంది.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.