English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో గిన్నెల గొడవ

'కింగ్ నాగార్జున'(Nagarjuna)హోస్ట్ గా వస్తున్న 'బిగ్ బాస్ సీజన్ 9'(Bigg Boss 9)గత సీజన్ల లాగానే బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా అలరిస్తు వస్తుంది. ఆరో వారంలోకి ప్రవేశించడంతో కొంత మంది కంటెస్ట్ లకి అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఈ మేరకు తాము అభిమానించే వాళ్ళే విన్నర్ గా నిలుస్తారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తు వస్తున్నారు. కానీ హౌస్ లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు అభిమానులకి చిరాకు తెప్పిస్తున్నాయి. షో లవర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అయేషా(Ayesha),రీతు(Rithu)మధ్య గిన్నెలకి సంబంధించిన గొడవ జరిగింది. ఆ ఇద్దరు ఈ విషయంపై ప్రస్తావిస్తు 'నువ్వు గిన్నె కడగలేదంటే, నువ్వు గిన్నె కడగలేదని గొడవ పడ్డారు. చాలా పెద్ద స్థాయిలోనే గొడవ జరిగింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు షో లవర్స్ స్పందిస్తు గిన్నెల గురించి గొడవ పడటం ఏంటి! అయేషా చేసిన ఓవర్ యాక్షన్ అయితే ఎంతో వెగటు పుట్టించింది. ఆమె పెద్దగా అరుస్తుంటే బర్రె గొంతులా ఉంది. కంటెస్ట్ లందరికి బిగ్ బాస్ టాస్క్ ఇస్తే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సంఘటనే కాదు రాత్రి జరిగిన ఎపిసోడ్ లో పవన్, రీతూ, కళ్యాణ్ లని ఉద్దేశించి సాయి మాట్లాడుతు వైల్డ్ కార్డు వచ్చాక టాప్ 5 లో ఉండేందుకు ఆ ముగ్గురు తెగ ఆరాటపడుతున్నారని అనడం, అందుకు అయేషా మాట్లాడుతు వాళ్ళకి మనమే అడ్డం, పైగా ఆ ముగ్గురు తనుజాని బయటకి పంపిస్తారు. ఆ తర్వాత వాళ్లలో వాళ్లే గొడవపడతారని మాట్లాడం జరిగింది. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, దివ్వెల మాధురి(Divvela Madhuri)అయేషా లు ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా అభిమానులు, షో లవర్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.



అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.