English | Telugu

బాహుబలి మళ్ళీ మొదలెట్టేశాడు

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యుల్ తరువాత దాదాపు 15 రోజుల విరామం తీసుకున్న ఈ చిత్ర యూనిట్ మళ్ళీ తమ పనిని మొదలుపెట్టింది. నేటి నుంచి మరో షెడ్యుల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభిస్తున్నారు.

ప్రభాస్ ఇందులో బాహుబలి, శివుడు అనే రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. బాహుబలికి జోడిగా అనుష్క నటిస్తుండగా, శివుడుకి జోడిగా తమన్నా జతకట్టింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయనున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.