English | Telugu

శతమానంభవతి జోడి రిపీట్ 

శర్వానంద్(Sharwanand)రచ్చ మూవీ ఫేమ్ 'సంపత్ నంది'(Sampath nandi)కాంబినేషన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో కూడిన చిత్రం ఒకటి తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 1960 వ కాలం నాటి నేపథ్యంలో తెలంగాణ(Telangana)మహారాష్ట్ర(Maharashtra)బోర్డర్ లో జరిగే కథగా తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా హైదరాబాద్ సమీపంలో సుమారు పదిహేను ఎకరాల్లో భారీ సెట్ ని వేశారు. మూవీకి సంబంధించిన షూటింగ్ ఎక్కువ భాగం అక్కడే జరగనున్నట్టుగా తెలుస్తుంది.

'శర్వానంద్' కి జోడిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)కనపడనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించడంతో మూవీకి మరింత క్రేజ్ వచ్చినట్లయింది. ఇంతకు ముందు ఈ జంట 2017 లో వచ్చిన 'శతమానంభవతి' లో కలిసి చేశారు. ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంట సంపత్ నంది(Sampath Nandi)సినిమా ద్వారా ప్రేక్షకులని మరోసారి కనువిందు చేయనుంది. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.

గతంలో సంపత్ నంది, సత్య సాయి ఆర్ట్స్ కాంబోలో ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్ లాంటి చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. సత్యసాయి ఆర్ట్స్ గత ఏడాది గోపీచంద్ తో 'భీమా' తెరకెక్కించింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.