English | Telugu

పూరీ "హార్ట్ ఎటాక్" కు అనూప్ సౌండ్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడు.

నితిన్-అనూప్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని చిత్రాలు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్టయ్యాయి. అయితే నితిన్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇది మొదటి చిత్రం కావడం. అదే విధంగా పూరీ-అనూప్ ల కాంబినేషన్ లో కూడా ఇదే మొదటి చిత్రం అవడం విశేషం. అయితే "ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంతో ఎలాగైనా నితిన్ తో హాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు అనూప్.

ప్రస్తుతం నితిన్ "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అదే విధంగా అనూప్ "మనం", "ఆటోనగర్ సూర్య" వంటి పెద్ద పెద్ద చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.