English | Telugu

'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఫస్ట్ రివ్యూ!

మరికొద్ది గంటల్లో 'ఆంధ్ర కింగ్ తాలూకా'
ఫస్ట్ రివ్యూ పాజిటివ్ గానే ఉందా?
రామ్ ఖాతాలో హిట్ పడుతుందా?

ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని, ఈ వారం 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిమాని బయోపిక్ గా పి.మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ రేపు(నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ రివ్యూ కూడా పాజిటివ్ గానే ఉంది. (Andhra King Taluka)

'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఇప్పటికే మూవీ టీంతో పాటు, సన్నిహిత వర్గాలు ఈ సినిమా చూసినట్లు సమాచారం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.

Also Read: చరిత్ర సృష్టించడానికి సై అంటున్న బాలయ్య!

చాలారోజుల పాటు గుర్తుంచుకునే.. ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ లా 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఉందని చెబుతున్నారు. ప్రచార చిత్రాలలో చూపించినట్టుగా హీరోపై ఫ్యాన్ చూపించే అభిమానం ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అయ్యేలా ఉందట. అలాగే, ఇందులో తండ్రీకొడుకుల ట్రాక్ ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచిందని అంటున్నారు.

రామ్, భాగ్యశ్రీ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయట. సున్నితమైన భావోద్వేగాలతో దర్శకుడు మహేష్ కథను నడిపిన తీరు కట్టిపడేసిందట. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు హృదయాన్ని హత్తుకునేలా ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై మంచి బజ్ ఉంది. ఇక ఇప్పుడు సెన్సార్ నుంచి, సన్నిహితుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇదే టాక్ వస్తే.. రామ్ ఖాతాలో హిట్ పడినట్లే. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.