English | Telugu

ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత!

ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏళ్ళ అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అందెశ్రీ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు గుర్తించారు.

ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. జనగాం వద్ద గల రేబర్తి అనే గ్రామంలో 1961, జులై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై గేయరచన చేసారు. పాఠశాలకు వెళ్ళి చదువుకోకపోయినా.. తన పాటలతో ఎందరినో చైతన్య పరిచారు. అందెశ్రీ అశు కవిత్వం చెప్పటంలో దిట్ట.

అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన 'జయ జయహే తెలంగాణ' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను.. 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు అందెశ్రీ.

నారాయణ మూర్తి నటించిన పలు విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలున్నాయి. 'మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు', 'సుడా సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి', 'పల్లెనీకు వందనములమ్మో', 'జన జాతరలో మన గీతం' వంటి పాటలు అందెశ్రీకి మంచి పేరు తీసుకొచ్చాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం