English | Telugu

యష్, అల్లు అర్జున్ లో ఆపేదెవరు!

యష్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో తమ తమ మాతృ భాషలో సినిమాలు చేసుకుంటు అగ్రహీరోలుగా కొనసాగుతు వస్తున్నారు. కానీ ఓవర్ నైట్ ఒకే ఒక్క సినిమాతో ఆ ఇద్దరు ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించారు. యష్ కేజిఎఫ్ తో అల్లు అర్జున్ పుష్ప తో ఆ ఘనత ని సాధించారు. తాజాగా ఆ ఇద్దరికీ సంబంధించి పోలిక ఉన్న న్యూస్ ఒకటి ఇరువురి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.

2018 లో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 1 , 2021 లో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ పార్ట్ 1 లు ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వచ్చి పాన్ ఇండియా ప్రేక్షకులని ఒక ఊపు ఊపాయి.అలాగే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కూడా సాధించాయి . అంతే కాకుండా అన్ని భాషల సినీ మేకర్స్ కి ఛాలెంజ్ కూడా విసిరాయి. ఆ తర్వాత 2022 లో కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ తగ్గలేదని నిరూపించింది. ఇప్పుడు 2024 లో పుష్ప ది రూల్ పార్ట్ 2 సునామీని సృష్టించడానికి సిద్ధం అవుతుంది.పైగా ఇంకో విషయం ఏంటంటే యష్, అల్లు అర్జున్ లు మరో సినిమా ఒప్పుకోకుండా వరుసగా కేజిఎఫ్, పుష్పలని చేసుకుంటు వచ్చారు.

అలాగే ఇంకో విషయం ఏంటంటే కేజిఎఫ్ చాప్టర్ 2 ఎండింగ్ లో చాప్టర్ 3 కూడా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే పుష్ప 2 తర్వాత పుష్ప 3 ది రోర్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇలా కేజిఎఫ్ కి పుష్ప కి పోలికలు వేసుకొని ఇరువురి అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు చాలా ఇంట్రెస్ట్ గా చర్చించుకుంటున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యష్ ప్రస్తుతం కేజిఎఫ్ కాకుండా వేరే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంటే ఆ తర్వాత కేజిఎఫ్ 3 ఉంటుందేమో. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అంటే ఆ తర్వాత పార్ట్ 3 చేస్తాడేమో.ఇప్పుడు యష్ అల్లు అర్జున్ కి ఉన్న ఈ పోలికలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరిలో ఆపేదెవరు అని సినిమా మనుషులు మాట్లాడుకుంటున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.