English | Telugu

చరణ్ మామ 'రైమ్'తో అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో!

రామ్ చరణ్, ఉపాసన దంపతుల దగ్గర 'రైమ్' అనే ఓ పెట్ డాగ్ ఉంది. బ్రౌన్ కలర్ లో ముద్దుగా ఉండే ఆ డాగ్ అంటే చరణ్ కి ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా తన వెంట తీసుకొని వెళ్తుంటాడు. అంతేకాదు 'ఆల్వేస్ రైమ్' పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది. అందులో రైమ్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆ క్యూట్ డాగ్ తో అల్లు అర్జున్ కుమార్తె అర్హ దిగిన ఫొటోలను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు హాజరయ్యాయి. ఇక చరణ్ తనతో పాటు రైమ్ ని కూడా ఇటలీ తీసుకెళ్లాడు. అక్కడ తన చరణ్ మామ పెట్ డాగ్ రైమ్ ని చూసిన అర్హ.. దానితో సరదాగా ఆడుకుంది. తన బుజ్జి చేతులతో రైమ్ ని ఎత్తుకొని మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. చరణ్, బన్నీ అభిమానులైతే ఈ ఫొటోలను చూసి తెగ సంబరపడుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.