English | Telugu

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఓటీటీలోకి అఖిల్ 'ఏజెంట్'!

ఈమధ్య జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కానీ 'ఏజెంట్' మాత్రం థియేటర్లలో విడుదలై ఐదు నెలలు అవుతున్నా, ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. అసలు ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

అక్కినేని అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 28న థియేటర్లలో విడుదలై పరాజయం పాలైంది. అయినప్పటికీ థియేటర్లలో మిస్ అయినవారు.. ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి బాగానే ఆసక్తి చూపారు. కానీ ఏవో కారణాల వల్ల ఓటీటీ విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. నెలలు గడిచిపోవడంతో ఈమధ్య అసలు ఆ సినిమా ఊసే లేదు. దాదాపు అందరూ మర్చిపోతున్న సమయంలో సడెన్ గా 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఈ సినిమాని సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సోనీ లివ్ ప్రకటించింది. మరి ఇంత ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న ఏజెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.