English | Telugu

శ్రీరాముని పట్ల భక్తి.. 'ఆదిపురుష్' టికెట్లు ఉచితంగా ఇస్తానని నిర్మాత ప్రకటన!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, రామ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లను ఉచితంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఆదిపురుష్' ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటుని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు 'ది కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ-2' వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తికరంగా మారింది. "శ్రీ రాముని పట్ల నాకున్న భక్తితో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు 10,000+ టిక్కెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను." అని అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఆయన నిర్ణయం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.