English | Telugu
సినిమా పేరు:అనగనగా ఒక ధీరుడు
బ్యానర్:అడోబ్ ఎంటర్ టైన్ మెంట్ మరియు వాల్ట్ డిస్నీ
Rating:3.50
విడుదలయిన తేది:Jan 14, 2011
బ్యానర్:అడోబ్ ఎంటర్ టైన్ మెంట్ మరియు వాల్ట్ డిస్నీ
Rating:3.50
విడుదలయిన తేది:Jan 14, 2011
పూర్వం అగర్తల అనే దేశంలో పసిపిల్లలు ఉన్నట్టుండి చావుబ్రతుకుల మధ్య పడి ఉంటారు.మోక్ష(హర్షిత)అనే దైవశక్తి కలిగిన పాప గనక అగర్తలకు వస్తే తమ పిల్లలు బ్రతుకుతారని అక్కడున్న ఒకమ్మాయి అంటే,ఆమెను తీసుకురావటనికి ద్రుకి(రాంజీ)అనే వ్యక్తి "నేను తీసుకువస్తానని"మోక్ష కోసం బయలుదేరతాడు.అక్కడికి వెళ్ళి మోక్షను అగర్తల వచ్చి పిల్లలను కాపాడాల్సిందిగా అక్కడున్న గురువుగారిని అడుగుతాడు.అదే సమయంలో ఐరంధ్రి(లక్ష్మీ ప్రసన్న)అనే ఒక దుష్ట శక్తి మోక్ష కోసం తన మనుషుల్ని పంపిస్తుంది.కానీ అక్కడున్న ఒక అంధ యోధడు వాళ్ళని చంపుతాడు.అతణ్ణి మోక్షకు రక్షణగా గురువు పంపుతాడు.దారిలో యోధ కావాలంటే అతనికి కళ్ళు తెప్పించగలనని మోక్ష అంటుంది.కానీ తన ప్రేయసి ప్రియ(శృతిహాసన్)లేని ఈ లోకాన్ని చూడాలనుకోవటం లేదంటాడు యోధ.మళ్ళీ మోక్ష కోసం తన మనుషుల్ని ఐరంధ్రి పంపిస్తుంది.ఈసారి కూడా యోధ వాళ్ళ బారి నుండి మోక్షను కాపాడతాడు. మోక్షను పట్టితేవటానికి తన మనుషులను ఐరంధ్రి ఈసారి కాకాసురల సాయం తీసుకోమంటుంది.కాకాసురల బారి నుండి కూడా మోక్షను యోధ కాపాడతాడు.అసలు మోక్షతో ఐరంధ్రికి పనేంటంటే నిజానికి ఐరంధ్రి పూర్తి మనిషికాదు.ఆమె తన వారసురాలైన ప్రియ నుంచి ఒక రక్తపు చుక్కని కాలనేత్రం ద్వారా తీసుకుని బ్రతుకుతూంటుంది.పూర్తిస్థాయిలో మనిషిగా మారాలంటే ఆమె మోక్షను చంద్రగ్రహణం రోజున సర్పశక్తికి బలివ్వాల్సి ఉంటుంది.అందుకామెకు మోక్ష కావాలి.చివరికి సిద్ధార్థ తన ప్రేయసి ప్రియను కలుసుకున్నాడా...?ఐరంధ్రి బారి నుండి మోక్షను యోధ కాపాడగలిగాడా....?అగర్తలలోని పసిపిల్లల ప్రాణాలు మోక్ష కాపాడగలిగిందా...? అన్న ప్రశ్ననలకు సమాధానమే మిగిలిన కథ.