English | Telugu
మరోసారి శర్వానంద్ - సుజీత్ కాంబో!?
Updated : Jul 13, 2022
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన `రన్ రాజా రాజా`(2014)తో దర్శకుడయ్యాడు సుజీత్. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయం నమోదు చేసుకున్న ఈ టాలెంటెడ్ కెప్టెన్.. ఆపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `సాహో`(2019) తీశాడు. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఉత్తరాదిన కాసుల వర్షం కురిపించింది. అయితే, దక్షిణాదిన మాత్రం నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సుజీత్ తన తదుపరి చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడని సమాచారం. అంతేకాదు.. సుజీత్ తొలి, మలి సినిమాలు `రన్ రాజా రన్`, `సాహో`ని ప్రొడ్యూస్ చేసిన యూవీ క్రియేషన్స్ బేనర్ లోనే.. ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని టాక్. అలాగే, ఇందులో సుజీత్ తొలి హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే సుజీత్, శర్వానంద్ సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానుంది. మరి.. సుజీత్ కి శర్వానంద్ మరోసారి కలిసొస్తాడేమో చూడాలి. కాగా, వరుస పరాజయాల్లో ఉన్న శర్వానంద్.. త్వరలో `ఒకే ఒక జీవితం`తో పలకరించబోతున్నాడు.