English | Telugu
ప్రియమైన వాళ్లను కోల్పోయినట్లు చెప్పి.. ఏడ్చేసిన పూర్ణ!
Updated : Aug 13, 2021
రష్మీ గౌతయ్ వయసెంత? స్ట్రయిట్గా ఎప్పుడూ ఆమె సమాధానం చెప్పిన సందర్భాలు లేవు. అసలు విషయం దాటవేస్తూ ఉంటుంది. ‘ఢీ’ షోలో కూడా ఆమెకు అదే ప్రశ్న ఎదురైంది. వచ్చే బుధవారం ఎపిసోడ్లో ప్రదీప్ హాస్టల్ వార్డెన్గా... ఆ గర్ల్స్ హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన అమ్మాయిల వలే రష్మీ, దీపిక, శర్వరీ, నైనికా... బాయ్స్ హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన అబ్బాయిల వలే సుధీర్, ఆది, అజహర్ వచ్చారు.
రష్మీ, దీపికలను పేర్లు చెప్పిన తర్వాత ‘వయసు?’ అని ప్రదీప్ అడిగాడు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ అంటూ రష్మీ పాట పాడింది. ‘పదహారు ఒకట్లా అమ్మా... పదహారు రెళ్లా?’ అని ప్రదీప్ అడిగాడు. ‘పదహారు మూడ్లు వేసినా తప్పు లేదు సార్’ అని సుధీర్ చెప్పాడు. అదేంటో... రష్మీ వయసు మీద ఎన్నిసార్లు జోక్స్, సెటైర్స్ వేసినా పేలుతూ ఉంటాయ్. చాలాసార్లు ఆమెను సీనియర్ సిటిజన్స్ కోటాలో వేస్తూ జోక్స్ వేశారు. సుధీర్ ప్లేబాయ్ ఇమేజ్ మీద మరోసారి జోక్స్ వేశాడు ఆది.
వచ్చే ప్రసారమయ్యే ‘ఢీ’ షో ఎపిసోడ్ ప్రోమో రీసెంట్గా రిలీజ్ చేశారు. అందులో కంటెస్టెంట్లు సాయి, నైనికా మధ్య నడిచిల లవ్ ట్రాక్ అందర్నీ ఎట్రాక్ట్ చేసిందని చెప్పాలి. చాటింగ్స్లో రొమాన్స్ ఉంటుందని, స్టేజి మీద ఉండటం లేదని గతంలో ఓసారి సాయి గురించి నైనికా చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి ఇద్దరూ ఒకరికొకరు లవ్యూ, లవ్యూ అని చెప్పుకొన్నారు.
ప్రోమో చివర్లో పూర్ణ ఎమోషనల్ అయ్యింది. ‘ఐ లాస్ట్ మై...’ అంటూ కన్నీటిపర్యంతమైంది. చూస్తుంటే... ఏదో విషాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఆమెను ఓదార్చడానికి పక్క సీట్లలో కూర్చునే ప్రియమణి, గణేష్ మాస్టర్ ప్రయత్నించారు. విషాదం ఏంటనేది తెలియాలంటే... బుధవారం వరకూ వెయిట్ చెయ్యాలి.