English | Telugu
'ద కశ్మీర్ ఫైల్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చింది
Updated : Apr 25, 2022
వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన 'ద కశ్మీర్ ఫైల్స్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మార్చి 11 న చిన్న సినిమాగా విడుదలైన కశ్మీర్ ఫైల్స్ రూ.250 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. పాండెమిక్ తర్వాత 250 కోట్ల మార్క్ అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. త్వరలో ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.
కశ్మీర్ ఫైల్స్ మూవీ మే 13 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తాజాగా జీ5 సంస్థ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. థియేటర్స్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా.. ఓటీటీలోనూ రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ తో సత్తా చాటుతుందేమో చూడాలి.
'ద కశ్మీర్ ఫైల్స్' మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించారు. ఇందులో 1990లో కాశ్మీరీ పండిట్లు ఎదురుకున్న నాటి పరిస్థితులని హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు.