Read more!

English | Telugu

చేజేతులారా 100 కోట్లు పోగొట్టుకున్న సల్మాన్ ఖాన్ 

సల్లు భాయ్ హీరో గా లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మెరిసిన మూవీ  టైగర్ 3 . దీపావళి కి థియేటర్స్ లో అడుగుపెట్టిన  ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్క్రీన్ మీద సల్మాన్ చూపించిన ఛరిష్మాకి ఆడియన్స్ మొత్తం ఫిదా అయ్యారు. కానీ  ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త ఆయన అభిమానులతో పాటు బాలీవుడ్ ని షాక్ కి గురి చేస్తుంది.

 దీపావళి పండగ రోజు టైగర్ కి   మార్నింగ్ ,మాట్నీ షో లు ఫుల్ అయినా కూడా పండగ మూడ్ లో ఉన్న జనాలు ఫస్ట్ అండ్ సెకండ్ షోస్ కి  వెళ్ళలేదు. ఆ తర్వాత రోజు నుంచి టైగర్ తన కలెక్షన్స్ పెంచుకున్నాడు.ఇలా సెకండ్ ,థర్డ్ డే మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు.కానీ వెంటనే ఇండియా న్యూజిలాండ్  సెమీ ఫైనల్ మ్యాచ్ ఉండటం  ఆ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా  ఫైనల్ మ్యాచ్ జరగడం వలన మళ్ళీ టైగర్ కలెక్షన్స్ కి బ్రేక్ పడ్డాయి. 300  కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన టైగర్ ఇప్పటివరకు 425 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇది తక్కువ ఫిగేర్ కాకపోయినా సరైన టైం లో టైగర్ ని రిలీజ్ చేసి ఉంటే  కనుక  ఇప్పటికి టైగర్  600 కోట్ల క్లబ్ లో  షికారు చేస్తుండేవాడు.ఈ విధంగా సరైన టైం లో టైగర్ రిలీజ్ అవ్వకపోవడంతో సుమారు 100  కోట్లు దాకా నష్టపోయింది. 

 యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ  టైగర్ 3 లో సల్మాన్ కి జోడిగా కత్రినా నటించగా ఇమ్రాన్ హష్మీ రేవతి,సిమ్రాన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.