Read more!

English | Telugu

తన పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకున్న రకుల్‌!

టాలీవుడ్‌లో ‘కెరటం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేసి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. త్వరలోనే ఈ బాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానితో ఆమె వివాహం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా విదేశాలో జరుపుకోవాలని ఆశించారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో తమ నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే ఈ జంట వివాహం చేసుకోబోతోందని సమాచారం. 

ఆమధ్య ప్రధానమంత్రి మోదీ లక్ష్యద్వీప్‌ పర్యటనకు వెళ్లినపుడు పర్యాటకులకు, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకునే వారికి ఒక సూచన చేశారు. దీని కోసం విదేశాలకు వెళ్ళకుండా మనదేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన సూచనకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే మోది మాటను గౌరవిస్తూ కొందరు విదేశాలకు వెళ్ళాలన్న తమ నిర్ణయం మార్చుకున్నారు. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గోవాలో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల అయోధ్యను కూడా సందర్శించిన ఈ జంట అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో, తమిళంలో రెండేసి చొప్పున సినిమాలు చేస్తోంది రకుల్‌. తెలుగులో మాత్రం ఏ చిత్రాన్నీ ఒప్పుకోలేదు. ఇటీవల ఆమె నటించిన ‘అయలాన్‌’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తమిళ్‌లో ఆమె చేస్తున్న మరో సినిమా ‘ఇండియన్‌ 2’. ఈ సినిమా ఈ సమ్మర్‌లో విడుదల కానుంది.