Read more!

English | Telugu

ఆస్తులమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా..అంతా అతనే చేసాడు 

ప్రియాంక చోప్రా.. ఆమె అందాన్ని చూస్తే అందానికే అసూయపుడుతుంది.ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు ఈ భూమ్మీద ఉన్నందుకే అందం అనే పదం పుట్టిందేమో అని కూడా భావించవచ్చు.  2000 వ సంవత్సరంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ అందగత్తె అనే హోదాలో  మిస్ వరల్డ్ గా నిలిచింది. అలాగే 2022 వ సంవత్సరం లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన మొదటి 100  మంది ఉమెన్స్ లో కూడా ప్రియాంక ఒకటిగా నిలిచి భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. అలాంటి ఆమె ఇప్పుడు వరుసగా చేస్తున్న కొన్నిపనులకి బాలీవుడ్ మొత్తం షాక్ అవుతుంది. 

ఎన్నో సినిమాల్లో తన అధ్బుతమైన నటనతో, అందంతో అలరించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబై లో ఉన్న తన ఆస్తులన్నింటిని వరుసగా అమ్మేస్తుంది. కొన్ని రోజుల క్రితం లోఖండ్ వాలాలో ఉన్న ఒక కమర్షియల్ ప్రాపర్టీ ని అమ్మేసింది. మళ్ళీ ఇప్పుడు అంధేరి శివారులో ఉన్న తన రెండు అపార్టుమెంట్ ల్లోని ప్లాట్ లని కూడా అమ్మేసింది. దీంతో ముంబై సినీ వర్గాల్లోను , ప్రియాంక అభిమానుల్లోను ప్రియాంక ముంబై ని వదిలి వెళ్ళిపోతుందనే బెంగ పట్టుకుంది.

2002 వ సంవత్సరంలో తమిళంలో విజయ్ తో చేసిన తమిజన్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత ఎన్నో హిందీ చిత్రాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటిన ఆమె  తన సహనటుడు నిక్ జోనస్ ని పెళ్లిచేసుకుంది. ఇద్దరికీ  ఒక పాప కూడా పుట్టింది. పాప పేరు  మాల్టీ మేరీ చోప్రా జోనాస్ .కొన్నిసంవత్సరాల నుంచి  ప్రియాంక లాస్ ఏంజిల్స్ లో ఉంటూ వస్తున్నా కూడా మళ్ళీ ఏదో ఒకరోజు ముంబై వచ్చి వరుసగా సినిమాలు చేస్తుందని అందరు భావించారు. కానీ ఇప్పుడు ఆమె  వరుసగా ముంబై లో ఉన్న ఆస్తులని  అమ్ముతుండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది.