Read more!

English | Telugu

సోనాక్షి సిన్హా పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యేందుకు అంగీకరించి, లక్షల్లో అడ్వాన్స్ తీసుకున్న సోనాక్షి.. ఆ ఈవెంట్ కి హాజరు కాకపోగా, తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణకు కూడా సోనాక్షి డుమ్మా కొడుతుండడంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణం కట్ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షికు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. 2019లో ఢిల్లీలో ఒక ఈవెంట్ ప్లాన్ చేసిన ప్రమోద్ శర్మ దానికి ముఖ్య అతిథిగా సోనాక్షిని ఆహ్వానించాడు. కానీ, ఆమె ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.37 లక్షలు తనకు తిరిగిచ్చేయాలని ప్రమోద్ కోరాడు. కానీ, ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయమై సోనాక్షిని కూడా ఎన్నో సార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ప్రమోద్ కేసు నమోదు చేశాడు. 

ఈ కేసు విషయమై విచారణకి హాజరుకాకపోవడంతో తాజాగా సోనాక్షిపై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఏప్రిల్ 25న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.