Read more!

English | Telugu

అతిలోక సుంద‌రి త‌న‌య ఎమోష‌న‌ల్ పోస్ట్

జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఎమోష‌న‌ల్ పోస్టు ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఉల‌జ్ షూటింగ్ పూర్త‌యింద‌ని చెబుతూ ఓ పోస్టు పెట్టారు జాన్వీ క‌పూర్‌. ఉల‌జ్‌లో జాన్వీ క‌పూర్‌తో పాటు గుల్ష‌న్ దేవ‌య్య‌, రోష‌న్ మాథ్యూ క‌లిసి న‌టించారు. సుధాంశు సారియా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న సినిమా ఇది. జాన్వీ క‌పూర్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న అత్యుత్త‌మ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. ఐదేళ్ల కెరీర్‌లో ఆమె ఎన్నో ర‌కాల పాత్ర‌ల్లో మెప్పించారు. మెట్టుకు మెట్టూ ఎదుగుతూ చాలా గొప్ప స్థాయికి ఎదిగారు జాన్వీ క‌పూర్‌. జామ్ ప్యాక్డ్ షెడ్యూల్‌తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు జాన్వీ క‌పూర్‌. ప్ర‌స్తుతం ఆమె జంగ్లీ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉల‌జ్‌లో న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 10న ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు జాన్వీ క‌పూర్‌.

``పేట్రియాట్రిక్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ ప్ర‌పంచంలో ఇంకా నేను చేయాల్సింది ఎంతో ఉంది. నాకు ప్ర‌తి సినిమా ఒక పాఠం. నా జీవితంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు, ఈ సినిమాలో జ‌రిగే కొన్నిటికీ మ‌ధ్య గాఢ‌మైన పోలిక ఉంది. మ‌నం ఏం చేస్తున్నామో దాన్ని ప్రేమించాలి. మ‌నం చేస్తున్న ప‌ని స‌రైన కార‌ణాల‌తో జ‌రుగుతున్న‌దా?  లేదా? అనేది కీల‌కం. చాలా సంద‌ర్భాల్లో ఒత్తిడుల నుంచి దూరం జ‌ర‌గాలి. ఇతరుల అభిప్రాయాలు మ‌న మీద ఉంటాయి. అలాంటి వాటి గురించి ఆలోచించాల్సి వ‌స్తుంది. మ‌న మీద, మ‌న ప్ర‌యాణం మీద మ‌న‌కు న‌మ్మ‌కం ఉన్నంత వ‌రకు మ‌నం న‌డ‌వ‌డ‌మే ఉత్తమం`` అని పోస్టులో రాశారు.

ద‌ర్శ‌కుడి గురించి చెబుతూ ``నా మీద నాకు న‌మ్మ‌కం కలిగేలా చేశారు మీరు. నా గురించి నాకు తెలియ‌ని విష‌యాల‌ను తెలియ‌జేశారు. నేనిప్ప‌టిదాకా చేయాల‌ని క‌ల కూడా క‌న‌ని ప‌నుల‌ను నాతో చేయించారు. నేను ప్ర‌తి అడ్డంకిని దాట‌డానికి ప్ర‌య‌త్నించాను. ప్ర‌తి చాలెంజ్‌నీ స్వీక‌రించాను. స్ఫూర్తిగా ప్ర‌తిదీ చేశాను`` అని అన్నారు. అమేజింగ్ టీమ్‌తో ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఉల‌జ్‌తో పాటు ఆమె మిస్ట‌ర్ అండ్ మిస్స‌స్ మ‌హిలో న‌టిస్తున్నారు. తెలుగులో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో దేవ‌ర మూవీ చేస్తున్నారు.