Read more!

English | Telugu

పెళ్ళి డేట్‌ ఫిక్స్‌?.. ఈ వార్తపై నోరు విప్పని రకుల్‌!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించి రకుల్‌ ఎప్పుడు అడిగినా.. దానికింకా టైమ్‌ ఉందని, టైమ్‌ చూసుకొని పెళ్లి చేసుకుంటామని చెప్తూ వస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఫిబ్రవరి 22న గోవాలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్ళి జరగనుందని పలు మీడియా సంస్థల్లో వార్తల వస్తున్నాయి. ఈ వివాహం కుటుం సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులకు ప్రత్యేక విందు ఇవ్వాలని రకుల్‌ ఆలోచిస్తోందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆ విషెస్‌కి ఎలాంటి రిప్లయ్‌ ఇవ్వడం లేదు రకుల్‌.