Read more!

English | Telugu

డంకీ ట్రైలర్.. షారూఖ్ కెరీర్ లో మరో వెయ్యి కోట్ల సినిమా అయ్యేలా ఉంది! 

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. షారూక్ తో పాటు తాప్సీ పన్ను, బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మంగళవారం ఈ సినిమా నుంచి ‘డంకీ డ్రాప్ 4’గా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

డంకీ కోసం డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఆవిష్కరించిన అందమైన ప్రపంచాన్ని డంకీ డ్రాప్ 4 పరిచయం చేస్తుంది. దీన్ని గమనిస్తే.. ట్రైన్‌లో నుంచి షారూక్ తను పుట్టి పెరిగిన ప్రాంతానికి వస్తాడు. అక్కడి నుంచి వారు ఎలాంటి సాహసం చేశారనే దాన్ని కూడా అతని స్వరంలోనే మనకు తెలియజేశారు. ఇందులో హార్డి అనే పాత్రలో షారూక్ నటిస్తున్నారు. తన పాత్రతో పాటు షారూక్ స్నేహితులైైన మను, సుఖి, బుగ్గు, బల్లి పాత్రలను, ఆ పాత్రల్లో నటించిన నటీనటులను డంకీ డ్రాప్ 4లో ఆవిష్కరించారు. ఈ కథంతా పంజాబ్‌లోని ఓ పల్లెటూరులో జరుగుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలనే కోరికతో, తమకు ఇష్టమైన వారు బావుండాలనే ఆశతో వారు లండన్ వెళ్లాలనుకుంటారు. ఈ ప్రయాణంలో ఐదుగురు స్నేహితులు ఎదుర్కొన్న సవాళ్లు, అసాధారణ పరిస్థితులు వారి జీవితాలను ఎలా మార్చాయనేది తెలియజేస్తూనే ప్రేమ, స్నేహం, భావోద్వేగాలతో సినిమా హృదయాలను హత్తుకునేలా ఉంటుందని తెలియజేసింది డంకీ డ్రాప్ 4. 
 
షారూక్ పుట్టినరోజు సందర్భంగా డంకీ డ్రాప్ 1 వీడియోను విడుదల చేసి అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఫీలింగ్‌ను అందించారు. డంకీ డ్రాప్ 2లో ‘లుట్ పుట్ గయా..’ సాంగ్ విడుదల చేశారు. ఇందులో అర్జిత్ సింగ్ గాత్రం అందరినీ ఆకట్టుకుంది. తర్వాత డంకీ డ్రాప్ 3 అంటూ సోనూ నిగమ్ అందమైన స్వరంతో పాడిన ఎమోషనల్ సాంగ్ 'నికలె ది కబీ హమ్ ఘర్ సే' పాటను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు డంకీ డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, స్నేహం సహా పలు అంశాలు ప్రేక్షకులను చక్కటి ఫీలింగ్‌ను అందిస్తున్నాయి. ఐదుగుు స్నేహితులు విదేశాలకు వెళ్లాలనే కోరికను ఎలా నేరవేర్చుకున్నారు. వారి గమ్యస్థానాన్ని వారు చేరుకున్నారా? అనే కథాంశంతో డంకీ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ తెలియజేస్తుంది. ఇందులో షారూక్ ముసలి పాత్రలోనూ కనిపిస్తున్నారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాని ఫిలిమ్స్ పతాకాలపై రాజ్‌కుమార్ హిరాని, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.