English | Telugu
ఇండియన్ డిన్నర్కు రూ. 49 లక్షల టిప్ ఇచ్చిన జానీ డెప్!
Updated : Jun 7, 2022
హాలీవుడ్ యాక్టర్లు, మాజీ భార్యాభర్తలు జానీ డెప్, అంబర్ హార్డ్ మధ్య పరువు నష్టం కేసు ఇటీవలే ముగిసింది. ఆరు వారాల పాటు సాగిన విచారణ అనంతరం ఈ కేసులో 50 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు డెప్. ఆ తర్వాత ఇంగ్లాండ్లో గిటారిస్ట్ జెఫ్ బెక్తో కలిసి మ్యూజికల్ టూర్లో పాల్గొంటున్న అతను పలుమార్లు పబ్లిక్ కళ్లలో పడుతూ వస్తున్నాడు. రీసెంట్గా బర్మింగ్హామ్లో ఓ ఇండియన్ రెస్టారెంట్కు వెళ్లిన డెప్, డిన్నర్ తర్వాత హోటల్ సిబ్బందిని ఆశ్చర్యపరుస్తూ పెద్ద మొత్తాన్ని టిప్గా ఇచ్చాడు.
2018లో వాషింగ్టన్ పోస్ట్ వార్తా పత్రికలో ఓ ఆర్టికల్ రాసిన డెప్ మాజీ భార్య అంబర్ హార్డ్, తనను తాను గృహ హింస నుంచి బయటపడ్డ వ్యక్తిగా చెప్పుకుంది. ఆమె జానీ డెప్ పేరును ప్రస్తావించకపోయినా, ఆమె నుంచి 50 మిలియన్ డాలర్లను నష్టపరిహారం కింద కోరుతూ అతని లీగల్ టీమ్ కేసు పెట్టింది.
కాగా, మ్యూజిక్ టూర్లో జెఫ్ బెక్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న డెప్ అందర్నీ షాక్కు గురిచేస్తూ లోకల్ పబ్స్కు వెళ్తున్నాడు. అలా బర్మింగ్ హామ్లోని ఓ ఇండియన్ రెస్టారెంట్కు వెళ్లి, వచ్చేప్పుడు 50 వేల పౌండ్ల (సుమారు రూ. 49 లక్షలు)ను ఇచ్చాడని డెయిలీ మెయిల్ రాసింది. ఆ రెస్టారెంట్లో ఇండియన్ డిషెస్, కాక్టెయిల్స్, రోజ్ షాంపేన్ను డెప్ ఎంజాయ్ చేశాడు. ఆ రెస్టారెంట్ వారణాసికి చెందిన వ్యక్తిది. అక్కడ నుంచి వెళ్లేప్పుడు సిబ్బందితో, రెస్టారెంట్ యజమాని కుటుంబంతో డెప్ ఫొటోలు దిగాడు, వాళ్లను హగ్ చేసుకున్నాడు.