బీహార్‌ రైలు ప్రమాదంలో 35 మంది మృతి

  సోమ‌వారం ఉద‌యం బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స‌హార్సా నుంచి పాట్రా వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున భ‌మారా రైల్వే స్టేష‌న్ల్‌లో ప్రమాదానికి గురైంది. వేగంగా వ‌స్తున్న ట్రైన్ ప్రయాణికుల మీద‌కు దూసుకెళ్లడంతో 12 మంది అక్కడిక్కడే మ‌ర‌ణించారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు డ్రైవ‌ర్‌ను లాగి కొట్టారు. కొన్ని భోగిల‌కు నిప్పు పెట్టారు. అయితే మ‌ర‌ణించిన వారులో ఎక్కువ‌గా మ‌హిళ‌లు చిన్న పిల్లల ఉన్నారు. కొంత మంది శివ భ‌క్తులు ప‌ట్టాల మీద నిల‌బ‌డి ఆందోల‌న చేస్తుండ‌గా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వ‌చ్చింది. ఆ ట్రైన్‌కు అక్కడ స్టాప్ లేక‌పోవ‌డంతో ట్రైన్ చాలా వేగంగా వ‌చ్చింది దీంతో ఆందోళ‌న‌ను గుర్తించినా ట్రైన్‌ను ఆప‌లేక పోయారు అందువ‌ల్లే ప్రాణ న‌ష్టం అదికంగా సంభంవించింది. ఈ ప్రమాదం తో ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలకు అంత‌రాయం క‌లిగింది. ఇప్పటికే మృతుల సంఖ్య 35 కు చేర‌గా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.

నీచుల కోసం అమరుడైన పొట్టిశ్రీరాములు

      ప్రస్తుత పరిస్థితి చూస్తే పొట్టిశ్రీరాములు స్వార్థపూరితమైన, నీచ రాజకీయ నాయకులూ, ఓట్ల కోసం అర్రులు చాచే కుష్టు బిచ్చగాళ్ళ కోసం తన విలువైన ప్రాణాలు అర్పించారేమో అనిపిస్తుంది. ఆ అమరజీవి శీలావిగ్రహాలను కూలదోస్తున్నారంటే అంత కంటే నీచమైన విషయం మరొకటి ఉండదు. రౌడీయిజం చేసి, హత్యలు చేసి రాజకీయ నాయకులైన వారి విగ్రహాలు మాత్రం అన్ని ఊళ్ళల్లో, ప్రతి సెంటర్ లో చెక్కు చెదరకుండా ఉంటాయ్. అదే మన దౌర్భాగ్యం.   తన ప్రాణాలను పణ౦గా పెట్టి సాధించిన తెలుగువారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డ్రామాలకు పై నుండి చూస్తే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో! ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించుదాం.

రాష్ట్రప‌తి పాల‌న విధించండి

  ఇరుప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌ల నేప‌ధ్యంలో రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. ఆ వ్యాజ్యాన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను ఈ నె ల‌26 కు వాయిదా వేసింది. దీనికి తోడు సీమాంద్ర జిల్లాల్లో నిర‌స‌న‌ల‌తో అన్నిచోట్ల ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిచిపోవ‌డంతో కౌన్సిలింగ్ సజావుగా జ‌రిగేలా చూడాల‌ని కొంద‌రు విద్యార్ధులు కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ రెండు పిటిష‌న్‌ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు, దీనిపై వివరంగా ఆయా ప్రాంతాల అధికారుల నుంచి నివేదికలు తెప్పించి సమర్పించాలని డీజీపీతో పాటు ఆయా ప్రాంతాల ఐజీపీలను ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో పాల‌న స్ధంబించింద‌ని ఇప్పటికే దాదాపుగా అంద‌రూ ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు క‌నుక ప్రభుత్వాన్నికొన‌సాగించేక‌న్నా రాష్టప‌తి పాల‌న విధించిన ప‌రిస్థితిని చ‌క్కదిద్దాల‌ని పిటీష‌న‌ర్ కోరారు. వీటికి తోడు ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన మరో పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వానికి నోటిసులు పంపిన కోర్టు సమ్మెను నిరోధించేందుకు ఎటువంటి ముంద‌స్తు చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించింది.

హైద‌రాబాద్‌ ప్రత్యేక రాష్ట్రం: కావూరి

  తెలంగాణ ప్రక‌ట‌న అంశంపై కేంద్ర మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు ఎట్టకేల‌కు నోరువిప్పారు. రాష్ట్ర విభజన అంశంపై తమ మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రాకే అన్నారు. త‌ప్పని ప‌రిస్థితుల్లో రాష్ట్రాన్ని విభ‌జించాల్సి వ‌స్తే హైద‌రాబాద్‌ను  ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నారు. చాల రోజులుగా మౌనంగా ఉన్న ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. మూడు ప్రాంతాల రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ అభివృద్దిలో అంద‌రి కృషి ఉంద‌ని కాబ‌ట్టి హైద‌రాబాద్ అన్ని ప్రాంతాల వారికే చెందేలా నిర్ణయం ఉండాల‌న్నారు. త‌న మొద‌టి ప్రాదాన్యత మాత్రం స‌మైఖ్య రాష్ట్రానికే అని చెప్పారు. అధిష్టానం త‌ప్పకుండా విభ‌జ‌న నిర్ణయాన్ని పున‌రాలొచిస్తుంద‌న్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వర‌లోనే అందుకు సంభందించిన ప్రక‌ట‌న కూడా వెల‌వ‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.ఈ అంశానికి సంబంధించి సాయంత్రం తొమ్మిది మంది సీమాంధ్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. అనివార్య మైన ప‌క్షంలో రాజీనామాల‌కు కూడా వెన‌కాడ‌మ‌న్న కావూరి, అధిష్టానం మీద ఇంకా న‌మ్మక‌ముంద‌న్నారు. ఎప్పటికీ స‌మైక్యవాదులుగానే ఉంటామ‌ని రాష్ట్ర౦ ముక్కలు కాకుండా చూడాల‌ని ఆంటోని క‌మిటీకి నివేదిస్తామ‌న్నారు. విభ‌జ‌న వ‌ల్ల శాస్త్రీయంగా ఎలాంటి న‌ష్టాలు వ‌స్తాయో క‌మిటీ ముందుంచుతామ‌న్నారు

కవిత, వి.హనుమంత్ రావుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు

      హైదరాబాద్ లో శనివారం విధ్యుత్ సౌధలో ఉద్యోగుల భోజన విరామ సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా తెలంగాణా ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చి అక్రమంగా కోట్లు సంపాదించిన పెట్టుబడిదారులు చేస్తున్నదే సమైక్య ఉద్యమం అని విమర్శించారు.   " అలా అప్పుడు చెప్పులు లేని ఆ పాదాల దగ్గర కూర్చుని బాంచన్ కాల్మొక్తా" అని వాళ్ళు అనే వారని కొంతమంది ప్రజల అభిప్రాయం.   అలాగే  " తిరుమలలో సీమాంధ్ర ఉద్యోగులకు కొత్తగా ఏర్పడే తెలంగాణా రాష్ట్రంలో స్థానం లేదని" రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్ లో అందరూ ఉండొచ్చుఅనీ, ఆంధ్రవాళ్ళకి రక్షణ కల్పిస్తామని తెలంగాణా నేతలు అంటున్నారు. ఇది నమ్మదగ్గ విషయంలా లేదని కొంతమంది అనుకుంటున్నారు.  తెలుగు భాష మాట్లాడే అందరిదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి రాజధాని అయిన హైదరాబాద్ లో ఒక తెలుగు వాడికి మరో తెలుగు వాడు రక్షణ కల్పిస్తామని అంటున్నారు ఇది ఏ పాకిస్థాన్ లోనో, దుబాయ్ లోనో నివసించే తెలుగు వారికి రక్షణ కల్పిస్తామని అన్నట్టుగా ప్రజలు ఆశ్యర్య పోతున్నారు. దీనిపై పాఠకులను చర్చించమని కోరుతున్నాం. వారి వారి విలువైన అభిప్రాయాలను ఇక్కడ పోస్ట్ చేయమనికోరుతున్నాం.

టిడిపి హరికృష్ణ ఆత్మావిష్కరణ లేఖ

      తెలుగుదేశం ఎమ్.పి నందమూరి హరికృష్ణ మళ్లీ ఒక లేఖ రాశారు. తెలుగు జాతి కోసం అప్పట్లో నా తండ్రి ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ నా చెవుల్లో రింగురింగుమని మార్మోగుతూనే ఉన్నాయి. పార్టీ కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని శీరసావహించినా..ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. ఆ దిశగానే ముందడుగు వేస్తున్నానని” ఆత్మావిష్కరణ పేరుతో నేడొక లేఖ విడుదల చేశారు. అయితే తన లేఖతో పార్టీకి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.   ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని, విభజన కోసం కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది సీమాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని, తెలుగువారి మధ్య రాజుకున్న నిప్పు చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టిందని అన్నారు.

బీహార్‌లో ప్రయాణికులపై దూసుకెళ్ళిన రైలు

      బీహార్‌లో ఈరోజు తెల్లవారు జామున ఘోర రైలు ప్రమాదం సంభవించిది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 35కు పెరిగింది. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్ప్రెస్ భమారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి దూసుకొని వెళ్ళింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్ను కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. దీంతో ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

రాజకీయ పార్టీలకి ఇది దీక్షా సమయం

  మరో ఏడెనిమిది నెలలలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్నందున, రాజకీయ పార్టీలు, నేతలు ఈ సమైక్యరేసులోతమ రాజకీయ శత్రువుల కంటే ముందుండాలనే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతూ, పైకి మాత్రం ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు చేసి ఉద్యమాలలో పాల్గొంటున్నామని, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే దీక్షలు చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. ఒకప్పుడు ఒక గొప్ప లక్ష్యం సాధించేందుకు బ్రహ్మాస్త్రంలా వాడబడిన ఆమరణ నిరాహారదీక్షలు, నేడు మన రాజకీయపార్టీల పుణ్యామాని వాటి విలువ కోల్పోయాయి. షుగర్, బీపీ వంటి అనారోగ్య సమస్యలున్న నేతలు సైతం ఏదో ఒక డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్షలకి కూర్చోవడం వారిని చూసి వారి రాజకీయ శత్రువులు కూడా దీక్షలకి కూర్చోవడం నేడు సర్వసాధారణ విషయమయిపోయింది. నాలుగయిదు రోజుల తరువాత, ఎటూ పోలీసులు తమ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలిస్తారనే ధీమా ఉన్నందున నేతలు ధైర్యంగా ఈ ‘ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్షలకు’ కూర్చోనగలుగుతున్నారు.   నిన్న మొన్నటి వరకు ఒక మంత్రి గారి భార్యామణి చేసిన ఈ ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్ష షరా మామూలుగానే ముగిసిపోయింది. కొద్ది నెలల క్రితం కరెంటు చార్జీలు తగ్గించాలంటూ ఐదురోజులు నిరాహార దీక్ష చేసిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మళ్ళీ సమైక్యాంధ్ర కోరుతూ నేటి నుండి గుంటూరులోఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు.   ఇక, ఆమెకు పోటీగా తెదేపా  శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ తదితరులు కూడా సోమవారం నుండి గుంటూరులో నిరవధిక దీక్ష చేపట్టనున్నారు.తెదేపా నేత దేవినేని ఉమ కూడా త్వరలో విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షల పోటీలో పాల్గొనున్నట్లు సమాచారం. అయితే, ఇటువంటి ఎత్తుగడలతో రాజకీయ చైతన్యవంతులయిన ప్రజలను ఆకట్టుకోవచ్చునని, వారిని భ్రమింప జేయవచ్చునని రాజకీయపార్టీలు భావించడం అవివేకమే.

'విభజన' వ్యతిరేక మహోద్యమ లక్ష్యం !

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     "విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానమవుతుంద''ని తెలుగువాడు ఏనాడో అల్లుకున్న సామెతను, ఏకభాషా సంస్కృతుల బలమైన పునాదులు ప్రాతిపదికగా భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తెలుగువాళ్ళు 57 సంవత్సరాల తరువాత "విడిపోయి కలుసుందామనుకునే'' పరస్పర విరుద్ధమైన సూత్రీకరణపై ఆధారపడి పరస్పర ద్వేషాలు పెంచుకోవడం విచారకరం, ఖండనార్హం. 'విభజన' వితండవాదానికి ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికలేదో, రాజకీయ నిరుద్యోగులు పదవీకాంక్షతో ప్రారంభించిన ఉద్యమానికి కూడా సమర్థనీయమైన శాస్త్రీయ వివేచన లేదు. అందుకే "మాకు లెక్కలు వద్దు, మాది ఆత్మగౌరవ నినాదంపై ఆధారపడిన ఉద్యమం'' అని ఒక భాగంలోని తెలుగువాడే అందులోనూ సీమాంధ్రుడైన 'బొబ్బిలిదొర' "ఉద్యమం'' పేరిట ప్రారంభించిన తగాదా చిలికిచిలికి గాలివానై, "విభజించి-పాలించ''మన్న బ్రిటిష్ వలసపాలనావశేషమైన ''తురుపు''ముక్క నుంచి ఉత్తేజితురాలైన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం తెలుగుజాతినీ, సమైక్య రాష్ట్రాన్నీ "ఎన్నికల వ్యూహం''లో ఒక పావుగా చేసి విభజించడానికి నిర్ణయించిన తరుణంలో - కోస్తాంధ్ర, తెలంగాణా రాయలసీమ ప్రాంతాల ప్రజలమధ్య చిచ్చుపెట్టింది.   దేశంలోని ప్రతిరాష్ట్రంలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ప్రాంతాలమధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు ఏదో ఒక మూల తలెత్తడం సహజం. పెట్టుబడి వ్యవస్థాపాలకులు ఈ పరిస్థితిని పరిష్కరించలేని దశలోనే, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడంద్వారా పదికాలాలపాటు అధికారస్థానాలకు అంటకాగి ప్రజావ్యతిరేక సంస్కృతికి అలవాటు పడతుంటారు; చివరికి ప్రజలపేరిట రూపొందించామని, ప్రజల సంక్షేమం కోసమే రూపొందించామని ప్రగల్భించే 'పథకాల'ను ప్రజారంజకంగా అమలుచేయడంలో విఫలమవుతూ ఉండటం వల్లనే 'వేర్పాటు' ఉద్యమాలకు కూడా పాలకపక్షాలే కారణమవుతూంటాయి. ఈ క్రమంలో లోపం ఎక్కడుందో దానిని కనిపెట్టి దాన్ని సకాలంలో సరిచేసే రాచబాటలు వదిలి, అందుకు తేలికైన పరిష్కారంగా ప్రజలమధ్యనే పాలకపక్షాలు తంపులు పెడతాయి. ఫలితంగా, ఈ పరిణామాలకు బాధ్యులయిన పాలకపక్షాలను తెంపరితనంతో అధికారం నుంచి ఊడబెరికే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించకుండా ప్రజలు 'విభజన'వలలో చిక్కకుండా తమ 'వోటు'హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కాని ఆ ప్రజల హక్కునూ 'అవినీతి'కి ఆలవాలమైన అధికారపక్షాలు భ్రష్టుపట్టిస్తూ వచ్చాయి; నాయకులనే కాదు, అభ్యర్థులను సహితం ఎన్నికల సంతలో 'క్రయ-విక్రయ' సరుకులుగా మార్చుతున్నాయి.   నేడు తెలుగుజాతిని చీల్చాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ స్థాయిలో చేసిన తప్పుడు నిర్ణయం. ఆ నిర్ణయానికి లోబడిపోయిన ఒక ప్రాంతపు విద్వేషవాదులయిన రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నవారు "సీమాంధ్రుల దోపిడీ వల్లనే తెలంగాణా నష్టపోయింద''న్న అబద్ధపు ప్రచారం ద్వారా జాతి విచ్చిత్తికి పాల్పడ్డారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారానే వారివారి భాషా సంస్కృతులను పెంపొందించుకుంటూనే దేశసమైక్యతకు శ్రీరామరక్ష కాగలరన్న పలు తీర్మానాలకు రూపకర్త అయిన కాంగ్రెస్ నాయకత్వం ఈనాతితరం 66సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం సమైక్యరాష్ట్రాల విచ్చిత్తికి, భాషా రాష్ట్రాల పునాదులను స్వార్థబుద్ధితో, ఎన్నికల వ్యూహంలో భాగం చేసుకుంది. ఇది కాంగ్రెస్ లో కుక్కమూతి పిందెలుగా 1970లలో పుట్టుకొచ్చిన ఈనాటితరం! ఇందువల్లనే "విడిపోతేనే వికాసం'' అనీ, "విడిపోయి కలిసిఉందామ''న్న జాతి వ్యతిరేక నినాదాలకు అంకురార్పణ జరిగింది. కనుకనే తెలుగుజాతిలో భాగమైన తెలంగాణా ప్రాంతపు కృత్రిమ విభజనకు వ్యతిరేకంగా ఇతర రెండు ప్రాంతాలలోని [కోస్తా, రాయలసీమలు] ప్రజాబాహుళ్యం, ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, విద్యా, సాంస్కృతిక విభాగాలకు చెందిన అధికార, అనధికార శక్తులన్నీ తెలుగుజాతి సమైక్యతా స్ఫూర్తితో ఉద్యమించాల్సి వచ్చింది.   ఒకేజాతిగా ఉన్న భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ [విశాలాంధ్ర]ను విభజించరాదన్నరాష్ట్ర విశాల ప్రయోజనాలను కోరుకుంటున్న ఉద్యమకారులు దేశభక్తి, జాతిభక్తికన్నా విభజనను ప్రచారం చేస్తున్న కొలదిమంది రాజేకీయ నిరుద్యోగుల పాక్షిక 'ఉద్యమం' శ్రేష్ఠమైనదిగా ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు పెంచుకొనేతప్పుడు వ్యూహంలో 'ఉత్తమం'గా భావించుకుంది. ప్రపచంలో ఎక్కడైనా సరే [ఇండియాసహా] విడిపోయేహక్కు లేదా 'స్వయంనిర్ణయ హక్కు' ఆ జాతి మొత్తానికి ఉంటుంది గాని, ఏక జాతిలో అంతర్భాగమైన ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు.   అందుకే "సోవియట్ సోషలిస్టు సమాఖ్య'' "విడిపోయే హక్కు''ను జాతులకు ఖరారు చేస్తూ రాజ్యాంగ చట్టంలో హామీపడినప్పటికే ఏళ్ళపాటు ఏ ప్రత్యేక జాతీ సోవియెట్ పతనానికి దేశీయ పాలనా వ్యవస్థలోని స్వార్థపర శక్తులు సామ్రాజ్యవాద శక్తులతో 'లాలూచీపడి' దారితీసేంతవరకూ రిపబ్లిక్ నుంచి విడిపోలేదు! సోవియెట్ పతనం తరువాత, రష్యాగా పూర్వనామంతోనే పెట్టుబడి వ్యవస్థ పునరుద్దరణకు దారులు తీసిన తరువాత పాత సమాఖ్య నుంచి విడిపోయిన ప్రత్యేక రిపబ్లికలన్నీ అమెరికా సామ్రాజ్యవాద పాలనా వ్యవస్థ కుట్రలకు బలి అవుతూన్నాయని తెలుగువారు మరచిపోరాదు! సోవియెట్ సోషలిస్టు రిపబ్లిక్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్, అజర్ బైజాన్, కిర్గిజిస్థాన్ వగైరా కొన్ని రిపబ్లిక్ లలో అమెరికా సైనిక నివాసాలకు, అమెరికా క్షిపణులు కొన్నిటికి స్థావరాలుగా మారడమూ, ఇప్పుడు ఆ బెడద నుంచి బయటపడడానికి, పాత రిపబ్లిక్ లలోని ప్రభుత్వాలను స్థానిక ఎన్నికల్లో జోక్యానికి పాల్పడిన అమెరికా కుట్రలనుంచి తప్పించుకోడానికి నానాతంటాలు పడవలసి వచ్చిందని తెలుగుజాతిలోని వేర్పాటువాదులూ, స్వార్థపరులూ మరవరాదు, మరవరాదు!   1962 నాటికే చైనాకు వ్యతిరేకంగా అమెరికా శత్రు విమానాలకు భారతదేశాన్ని ఇంధనం నింపుకునే స్థావరంగా నాటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రహస్యంగా అనుమతించడాన్ని అమెరికా గూఢచారి సంస్థ కొత్తగా వెల్లడించి సంచలనం సృష్టించింది. రహస్యంగా ఈ పనికి నాటి కాంగ్రెస్ ప్రభత్వం పూనుకోడాన్ని మరవరాదు! ఇరుగుపోరుగుతో సమస్యలు తలెత్తడం కొన్ని సందర్భాల్లో సహజం కావొచ్చు. కాని వాటిని శాంతియుతంగా పరిష్కరించుకునే తీరువేరు! అలాంటి సమస్యలు పాలకవ్యవస్థల మూలంగా తలెత్తేవిగాని ప్రజాబాహుళ్యం మాత్రం అందుకు కారణం కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల మధ్య పాలకపక్షాల వల్లనే ఉత్పన్నమవుతూ వచ్చేవేగాని, సామాన్య ప్రజాకోటికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఈ వాస్తవాన్ని 1953కు ముందు తెలంగాణా ప్రజాబాహుళ్యంలో పెక్కు అట్టడుగు వర్గాలు [ఎస్.సి., ఎస్టీ, బడుగుబలహీన వర్గాలు] నిజాం నిరంకుశ పాలకులు, ఆ పాలనా శక్తికి చేదోడు వాదోడైన దొరలు, జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల దాష్టికాలకూ, చిత్రహింసలకూ గురవుతూ వచ్చారు; 'నీబాన్చను దొరా' అన్న సంస్కృతికి వీళ్ళంతా కష్టజీవులందరినీ గురిచేశారు. ఆనాటి పరిస్థితుల్ని తారుమారు చేసిన ఏకైక మహోద్యమం, రైతాంగ, కార్మిక, మధ్యతరగతి వర్గాల గ్రామీణ ప్రజలు పాల్గొన్న తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం మాత్రమేనని, ఆ పోరాటమే తెలుగుజాతిని భాషాప్రయుక్త రాష్ట్రంగా, ఒక్క తాటిపైకి తెచ్చి 'విశాలాంధ్ర' అవతరణకు సుసాధ్యం చేసిందని కలలో కూడా తెలుగువాడు మరవకూడదు. హైదరాబాద్ సంస్థాన విమోచన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సమీకరించిన సైన్యనిరహాల వల్ల జరిగిన పని - అంతకుముందు సాయుధ పోరాటం ధాటికి తట్టుకోలేక వివిధ నగరాలకెక్కిన దొరలు, జాగిర్దార్లు తిరిగి తెలంగాణా గ్రామసీమలకు మళ్ళి, అంతకుముందు సాయుధ పోరాట ఫలితంగా బడుగు బలహీనవర్గాలు అనుభవిస్తున్న పదిలక్షల ఎకరాలను పోలీసుల అండతో తిరిగి స్వాధీనం చేసుకున్న వైనాన్ని మరిచిన స్వార్థపర వర్గాలే, తిరిగి తెలంగాణా ప్రజలపైన తమ అధికారాన్ని స్థాపించుకోడానికి ఆ వర్గాలే ప్రజల పేరిట ప్రజావ్యతిరేక 'వేర్పాటు' ఉద్యమాన్ని ప్రారంభించారు!   ఉభయ ప్రాంతాలలోనూ ప్రజల అనేక త్యాగాల ఫలితం - ఆంధ్రప్రదేశ్ అవతరణ. 1953కు ముందు "హైదరాబాద్ స్టేట్'' [తెలంగాణా రాష్ట్రం అంటూ ప్రత్యేకంగా ఎన్నడూ లేదు. హైదరాబాద్ స్టేట్ లో మన తెలంగాణా ప్రాంతం ఒక భాగం మాత్రమే] కనుకనే తెలంగాణా వైతాళికులలో ఒకరైన పండిత సురవరం ప్రతాపరెడ్డి, చివరికి "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్'' పుట్టుపూర్వాలను ప్రస్తావిస్తూ 1946లో తెలంగాణాలోని "ఆంధ్రమహాసభ'' 13వ సభ ముగిసిన తర్వాత ఏర్పడిన "హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్''లో ఉన్న సభ్యులు తెలంగాణా వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సభ్యులూ ఉన్నార''ని  తెలపాల్సివచ్చింది. కాగా, తెలంగాణలో "ఆంధ్రప్రాంతీయ సంఘం'' ప్రత్యేకించి "ఆంధ్రప్రాంతీయ సంఘం''గా మాత్రమే వ్యవహరించబడుతూ వచ్చిందని చెప్పారు! నాడు తెలుగువారికి తెలుగు స్కూళ్ళను పెట్టనివ్వక, తెలుగుబాషను "తెలంగీ-భేడంగీ'' అని తెలుగువారిని నిజాములు అవమాన పరిచారు. ఇందుకు మినహాయింపు, తెలుగు సాహితీపరులను, వారి రచనలను గౌరవించినవారు ఒక్క కుతుబ్ షాహీలు మాత్రమే, వారిలోనూ ఒక్క కులీ కుతుబ్ షాయే చివరిదాకా మన్ననలు పొందిన వాడు! ఈ పరిస్థితుల్ని వర్ణిస్తూ సురవరంవారు "బహు దీర్ఘకాలం నుండి మనం (తెలంగాణా ఆంధ్రులు) ఇతర రాష్ట్రీయ సోదరులకన్న వెనుకబడుటకు కారణము లేవో, అట్టి లోపములను రూపుమాపుకుని అగ్రస్థానం వహించడానికి కావలసిన సామాగ్రి గురించి విచారించాలి ... మనలో ఐకమత్యం లేదు. మనము జాతి, మత భేదములచే శాఖోపశాఖలుగా విభజింపబడి ఉన్నాం. లక్షకొలది bold సోదరులను మనము మనుష్యవర్గంలో లెక్కపెట్టక వారిని అంటరానివారిగా భావించి పశువులకన్నను, వృక్షములకన్నను, తుదకు ప్రాణంలేని (జడ) పదార్థములకన్నను హీనముగా భావించు చున్నాము'' bold end అని 1930 మార్చిలోనే నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించుతూ స్పష్టం చేశారు!   1953కు ముందు, అంటే 1948లో హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన రైతాంగసాయుధ పోరాటం వల్ల ప్రధానంగా విమోచన పొంది ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏర్పడేదాకా, స్వాతంత్ర్య సమరయోధుడు బూర్గుల రామకృష్ణారావు "హైదరాబాద్ స్టేట్'' ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరితో సమైక్యాంధ్ర రాష్ట్ర అవతరణకు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ, ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ అనుకూలంగా తీర్మానాలు దోహదం చేశాయి. అత్యధిక సంఖ్యాకుల ఆమోదంతోనే హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ [120 మందిలో వందమందికి పైగా] ''విశాలాంధ్ర''కు అనుకూలత వ్యక్తం చేసింది! అదిగో, ఈ పూర్వరంగంలోనే, తెలంగాణా "ఆంధ్రమహాసభ''లోని మితవాదవర్గానికి నాయకులుగా ఉన్న కె.వి.రంగారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి మైనారిటీ వర్గం ఆరోజునుంచి మొన్నమొన్నటిదాకా [ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో పదవులు అనుభవిస్తూనే]లోపాయిగారీగా తెలుగుజాతి ఐక్యతకు తూట్లు పొడుస్తూనే వచ్చారు!   వీరూ, కొత్తతరంలోని రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న 'దొర'లు, తిరిగి పాత జాగిర్దారీ, పటేల్, పట్వారీ వర్గాలు మాత్రమే "ప్రత్యేక తెలంగాణా'' రాష్ట్ర ఏర్పాటు ద్వారా మరొకసారి తెలంగాణా ప్రాంతంలోని బడుగు, బలహీన, బహుజన వర్గాలపై పెత్తనం చెలాయించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు; అందుకోసమే తోటి తెలుగుప్రజలపైన అబద్ధాలాతో, బూతులతో స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి, భ్రమలతో ప్రాంతీయ యువతను ఆత్మహత్యల వైపు నెట్టారు, నెడుతున్నారు. బెదిరింపులద్వారా తోటి తెలుగుప్రజలను ఉద్యోగులనూ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చారు. అటు వైపున విడిపోకూడదనే వారూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగుజాతి విడిపోకూడదన్న వారిని శత్రువులుగా భావించి, ఉద్రిక్త వాతావరణాన్ని విభజనవాదులు సృష్టించారు; ఈ పరిణామం బెడిసిపోయి మరింత విషమ పరిణామాలకు దారితీయక ముందే సమైక్యతా ఉద్యమం బలంగా ముందుకు సాగుతూండడంతో అననుకూల పరిస్థితుల్లో "శాంతి'' మంత్రాన్ని ఉచ్చరించడంతో పాటు "హెచ్చరికల''కూ దిగుతున్నారు; ఇంతకుముందు తోటి ఆంధ్రులందరినీ మూకుమ్మడిగా "సీమాంధ్రులు తెలంగాణా నుంచి వెళ్ళిపోకపొతే చేతులు విరగ్గొడతాం, కాళ్ళు నరుకుతాం'' అనీ, "పులిమీద మనం ప్రయాణిస్తున్నాం దానిమీదనుంచి దిగినా, దిగకపోయినా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు'' అన్న 'దొర' కెసిఆర్ అందించిన ఉన్మాదపూరిత నినాదాన్ని దారి తప్పిన కొందరు 'ప్రగతి'వాదులు కూడా అందిపుచ్చుకున్నారు! కాగా, వారి తాజా 'నినాదం' ఇప్పుడు "మాకు సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే శత్రువులుగాని, సీమాంధ్రప్రజలు మాత్రంకాద''ని బాణీ మార్చారు! ఆలస్యంగానైనా ఈ గుర్తింపు మంచిదే, నిస్పృహ నుంచి స్పృహలోకి వచ్చే ప్రయత్నం మెచ్చదగిందే. కాని "ప్రత్యేక తెలంగాణా''కు పచ్చజెండా వూపినట్టు కన్పించిన కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు చేసిన 'తీర్మానం' మాత్రం కేవలం ఆ పార్టీ ఆవరణకే పరిమితమైంది! రెండు ప్రాంతాలలోనూ అభాసుపాలైన కాంగ్రెస్ హైదరాబాద్ కేంద్రంగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో రెండు ప్రాంతాల ప్రభుత్వాలను 'నిర్వహించడం'ద్వారా 2014 నాటి ఎన్నికలలోకి దూకి సరైన విజయావకాశాలను పెంచుకోవాలని "గుంట కాడ నక్క''లా వ్యవహరిస్తోంది! ఈలోగా వెలువడుతున్న "సర్వేలు'' మాత్రం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పడినా ఏర్పడకపోయినా కాంగ్రెస్ ఉభయ ప్రాంతాల్లోనూ ఉసురు నిల్పుకోలేదని జోస్యం పలకడం ఒక విశేషం! కనుకనే పనికిమాలిన "కమిటీల''తో, కెసిఆర్ తో మంతనాల ద్వారా కాలక్షేపం చేస్తోంది కాంగ్రెస్! ఈ రెండు శక్తులలో ఎవరు ఎవరిని ముంచబోతున్నారో ఇక ఎన్నికల "వెండితెర పైన'' చూసేలోపే రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియ కాస్తా కాంగ్రెస్ చేతులు దాటిపోయి, సమైక్యాంధ్రే నిలబడగల అవకాశాలు పెరుగుతున్నాయి! చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న పరిణామ దశలోకి కాంగ్రెస్ ప్రయాణిస్తోంది!

సోనియాకు టెన్షన్..ప్రణబ్ కు మొర

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనసహా సరిహద్దులలో ఉద్రిక్తత, పార్లమెంటులో బిల్లుల ఆమోదం, రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం తదితర సమస్యలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె, ఒకనాటి తమ పార్టీ 'గడ్డు సమస్యల పరిష్కర్త', నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శరణుజొచ్చారని సమాచారం. రెండు రోజుల కిందట మధ్యాహ్న భోజన సమయంలో ఆయనతో భేటీ అయిన సోనియా, గంటన్నరపాటు అనేక అంశాలపై మాట్లాడారు. కానీ, వారి సంభాషణ సారాంశం ఏమిటో చెప్పలేమని పార్టీ వర్గాలు అంటున్నాయి.   అయితే, నియంత్రణ రేఖవద్ద పాక్ సైనిక మూకలు ఐదుగురు జవాన్లను బలిగొనడం, దాంతోపాటు దాదాపు 15 రోజులుగా కాల్పులు కొనసాగించడం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇక "సహనానికీ హద్దులుంటాయ''ని స్వాతంత్య్ర దినం ముందురోజున తన ప్రసంగంలో ప్రణబ్ పాక్‌ను గట్టిగానే హెచ్చరించారు. కానీ, మరునాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట ప్రసంగం చప్పగా చల్లారిపోవడం సోనియాను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని భోగట్టా. అంతకుముందు కూడా పాక్‌పై మెతకదనం పనికిరాదని, మరింత కఠినవైఖరి అవసరమని పార్టీ ఒత్తిడి తెచ్చింది. ఫలితంగానే భారత్ వ్యతిరేక పాక్ జాతీయ చట్టసభ తీర్మానాన్ని ఖండిస్తూ మన పార్లమెంటులో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చేనెల ఆ దేశ ప్రధానితో మన్మోహన్ భేటీపైనా కచ్చితమైన సమాచారం పంపలేదనీ తెలిసింది. ఇవన్నీ అటుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై తన కలవరాన్ని అధినేత్రి ఆయనవద్ద వెళ్లబోసుకున్నారని సమాచారం. దీంతోపాటు తెలంగాణ, సీమాంధ్ర చిక్కుముడిపైనా వారు చర్చించినట్లు తెలియవచ్చింది.

సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం

      సీమాంద్ర లో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ మీద సీమాంధ్ర నేతలు నానా రభస చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు. పదేళ్ల ఉమ్మడి రాజధానికి సుముఖం అని ఆంటోని కమిటీకి తెలిపారని, హైదరాబాద్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి హక్కులు ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలో సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారని, తెలంగాణలో జనాలను రోడ్డు మీదకు ఎక్కకుండా అడ్డుకున్న వీరంతా సీమాంధ్రలో సోనియా చిత్రపటాలు తగలబెడుతున్నా, ఇందిరా, రాజీవ్ విగ్రహాలు కూల్చుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సీమాంధ్రలో జరుగుతున్నది రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటం అని విమర్శించారు.   తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. కరీంనగర్ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రలు తెలంగాణ అంతటా నిర్వహిస్తారు.

విహెచ్ పై దాడిని ఖండించిన సోమిరెడ్డి

      కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుపై తిరుమలలోని అలిపిరి వద్ద సమైక్యవాదులు దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. దాడులు తమ సంస్కృతి కాదని హరీష్‌రావు అంటున్నారని, అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిందెవరని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో దళిత ఉద్యోగిపై హరీష్‌రావు దాడి చేయలేదా అని అడిగారు. తెరెస, బిజెపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. సమైక్య ఉద్యమం కుట్రపూరితమైనదని విహెచ్ రెచ్చగొట్టడం సబబుకాదని సోమిరెడ్డి అన్నారు.

తిరుమలలో విహెచ్ కి సమైక్య సెగ

      ఎట్టకేలకు భారీ భద్రత మధ్య తిరుమల కొండపైకి దిగిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకు సమైక్య సెగ తగిలింది. విహెచ్ వాహనాన్ని సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నెట్టేసేందుకు ప్రయత్నించారు. స్వల్పంగా లాఠీచార్జీ కూడా చేశారు. సమైక్యవాదుల్లో ఒకరి నుంచి విహెచ్ గులాబీ పూవు తీసుకున్నారు. తాము ఆందోళన చేయబోమని గులాబీ పూలు అందిస్తామని చెప్పడంతో పోలీసులు ఐదుగురికి అనుమతించారు. అయితే, అలిపిరి వద్ద విహెచ్ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు వి.హనుమంతరావును అక్కడి నుంచి సురక్షితంగా ముందుకు తీసుకుని వెళ్లారు.

బొత్సకి సమైక్య సెగ

      పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించేందుకు ఉపాధ్యాయ జేఏసీ నేతలు ప్రయత్నించారు. జిల్లా కేంద్రంలో ఉన్న పీసీసీ చీఫ్ బొత్స ఇంటిని ముట్టడించేందుకు ఉపాధ్యాయ నేతలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్యమకారుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయనగరం జిల్లాలో సమైక్య ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. జిల్లా అంతటా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. విజయనగరం వచ్చిన మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానికి సమైక్య సెగ తగిలింది. సెప్టెంబరు 1 నుండి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్దమవుతున్నారు. గత నాలుగు రోజులుగా సమ్మె మూలంగా జిల్లాలో జనజీవనం స్థంభించింది.

గొల్లపూడి వద్ద దేవినేని ఉమ అరెస్ట్

      ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సీమాంధ్ర పరిరక్షణ కోసం దీక్ష తలపెట్టిన ఆయన శనివారం ఉదయం తన నివాసం నుంచి దీక్ష శిబిరానికి బయలుదే రగా గొల్లపూడి వద్ద దేవినేని సహా కేశినేని నాని, పలువురు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు యత్నించడంతో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది.ఉమాను ఎక్కడికి తరలించినా దీక్ష కొనసాగుతుందని వర్ల రామయ్య తెలిపారు.మరోవైపు మొగల్రాజపురంలో బోండా ఉమాను తన స్వగృహంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

రాజకీయ వ్యూహాలు మేడ్ ఇన్ తెదేపా

  నాయకత్వ లోపంతో బాధపడుతున్న వైకాపా ఇటీవలకాలంలో రాజకీయంగా చాలా చురుకుగా వ్యవహరిస్తూ తెదేపాకు సవాలుగా నిలుస్తోంది. సమైక్య నినాదంతో రాజీనామాలు చేసిన తరువాత మధ్యలో కొంచెం చల్లబడినప్పటికీ, జగన్, విజయమ్మల రాజీనామాలతో మళ్ళీ ఆపార్టీ కొంచెం వేగం పుంజుకొంది. తెదేపా నిరాహార దీక్షలకు సిద్దపడుతున్నసంగతి కనిపెట్టిన ఆ పార్టీ, వారికంటే ముందుగానే ఈ నెల 19న విజయమ్మ దీక్ష మొదలుపెట్టబోతోంది. ఇక, చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర గురించి మీడియాలో వార్తలు రాగానే, ఆయన కంటే ముందుగానే వైకాపా కూడా ఈనెల 22 నుండి బస్సు యాత్రలు మొదలుపెట్టబోతోంది. తెదేపా తన ఆలోచనలతో, ప్రణాళికలతో స్వయంగా ప్రయోజనం పొందలేకపోతున్నపటికీ, ఈవిధంగా వైకాపాకు మాత్రం చక్కటి మార్గదర్శనం చేయడం విశేషం. వైకాపా కూడా వ్యుహాలకోసం బుర్రలు బ్రద్దలు కొట్టుకొనే బదులు తెదేపా దగ్గర రెడీ మేడ్ గా దొరుకుతున్న వ్యూహాలను అమలు చేస్తూ తెదేపా కంటే దూసుకుపోతోంది.

వైకాపాతో రాజీకొచ్చిన కొణతాల వర్గం

  దాడి వీరభద్రరావు చేరికతో వైకాపాకు దూరమయిన కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ లేదా తెదేపాలో చేరుతారని అందరూ ఊహించారు. అయితే, ఆయన మాత్రం అటువంటి ప్రయత్నాలేవీ చేసినట్లు కనబడలేదు, కానీ ఇంతకాలం పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే, ఈ నెల 19నుండి వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయవాడలో విజయమ్మ చేపట్టే దీక్ష చేపట్టబోతున్న సందర్భంగా, ఆమెకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేపట్టాలని, అదేవిధంగా ఈ నెల 22 నుంచి పార్టీ నిర్వహించే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలకి పిలుపునిచ్చారు. అంటే, ఆయన దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేయడానికి కూడా సిద్దపడినట్లే భావించవచ్చును. ఇది పార్టీకి, అయన ప్రత్యర్ధులకు కూడా ఊహించని పరిణామమే. బహుశః కొణతాల వర్గం ప్రస్తతం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో కేవలం తాత్కలికంగా వెనక్కి తగ్గి ఉండవచ్చును. ఎన్నికలు దగ్గరపడిన తరువాత ఆయన వర్గం పార్టీ మరే అవకాశం ఉంది.

20న జాతీయ రహదారుల దిగ్బంధం

      సమ్మె ఆగదు. ఆపేది లేదు. మరింత తీవ్రం చేస్తాం. సీమాంధ్ర ఎంపీలందరూ రాజీనామాలు చేసేదాకా వెనక్కి తగ్గేదే లేదు.. అని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఈ నెల 19 నుంచి సీమాంధ్ర వ్యాప్తంగా ఒకేవిధమైన ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని అశోక్‌బాబు ప్రకటించారు. "19న అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలి. 20వ తేదీన పూర్తిస్థాయిలో రహదారులను దిగ్బంధించాలి. 21వ తేదీన సీమాంధ్రలో ప్రజలు తరలివచ్చి ఉదయం 10.30 గంటల నుంచి 11 వరకు అన్ని జాతీయ రహదారులపై మానవ హారాలు నిర్మించి సమైక్యాంధ్ర నినాదాలు చేయాలి. అదే రోజున సాయంత్రం 6.30 గంటల నుంచి కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించాలి. 22, 23వ తేదీలలో తాలూకా, డివిజన్, జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి. ఇందులో... అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలి.   24 నుంచి 30వ తేదీ వరకు వరకు ఉద్యోగులు, నాయకులు, కార్మికులు కుటుంబ సభ్యులతో సహా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలి'' అని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో మహాసభ నిర్వహిస్తామని... రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలో అవగాహన కల్పించడమే దీని ఉద్దేశమని ప్రకటించారు. ఉద్యోగులు చేపట్టిన సమైక్య సమ్మెకు మద్దతు ఇచ్చే ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా తాము ఆదరిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

తెలంగాణలో బ్రోకర్ ఎవరో తేలాలి

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తనను బ్రోకర్ అనడంపై ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మండిపడ్డారు. తాను బ్రోకర్ ను కానని, తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందరికీ తెలుసు అని టీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్ పై 10 అంశాలకు సంబంధించిన ఆరోపణలున్న కవర్ ను జేఏసీకి పంపిస్తున్నానని, ఈ అంశాలపై జేఏసీ విచారణ జరిపించాలని దిలీప్ కుమార్ కోరారు.   రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్య బ్రోకర్ గా వ్యవహరించిందెవరు?ఒడిషాలో వ్యాపారిని కిడ్నాప్ చేసిందెవరు?సినిమా వాళ్ల దగ్గర వసూళ్లకు బ్రోకర్ గిరి చేసిందెవరు అంటూ పలు ప్రశ్నలను ఆయన సంధించారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ లో చేరుతున్న నేతలకు మధ్య వర్తిత్వం వహిస్తున్నారని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.