కల్వకుర్తి అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ

      మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ బిజెపి, కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. కల్వకుర్తి 1వ రౌండ్ నుంచి 28వ రౌండ్ వర కు నువ్వా.. నేటా అన్న ట్లు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. చివరి రౌండ్ లెక్కింపు లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆచారిపై 157 ఓట్ల ఆధిక్యం లభించింది. ఓట్ల లెక్కింపులో జూపల్లి గ్రామ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈవీఎం మొరాయింది. దీంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు.అది తెరచుకోకపోతే మళ్లీ ఆ బూత్ లో రీపోలింగ్ పెట్టవలసి వస్తుందా అన్నది సమస్య. అయితే ఇప్పటికే మెజార్టీ తెలిసిపోయినందున దానిని కాపాడుకోవడానికి కాంగ్రెస్,అదిగమించడానికి బిజెపి ప్రయత్నిస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరి ఈ సమస్యను ఎన్నికల సంఘం ఎలా పరిష్కారిస్తుందో వేచి చూడాలి.

వెన్నుపోటు పొడిచారు.. ఓడిపోయారు...

  తెలుగు ప్రజలకు.. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు దారుణంగా ఓడిపోయారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తుంటే రాజీనామాలు చేయడానికి కూడా మనసు రాక పదవులు పట్టుకుని వేలాడుతూ చోద్యం చూసినవాళ్ళంతా ఈ ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోయారు. రాయపాటి సాంబశివరావు అయితే ఎన్నికల ముందే నెత్తిన గుడ్డేసుకున్నారు. మిగతా సీమాంధ్రకి చెందిన కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, పళ్ళంరాజు, పనబాక లక్ష్మి విభజనకు పూర్తిగా సహకరించారు. దానికి ఫలితం ఇప్పుడు అనుభవించారు. పనబాక లక్ష్మి అయితే నేను విభజనకు అనుకులం, విభజన చేస్తే ఏమవుతుందంట లాంటి డైలాగ్స్ వాడి సీమాంధ్రుల మనసులను గాయపరిచారు. అంత గాయపరిచినా మళ్ళీ ఎన్నికలలో సీమాంధ్రులు తమని గెలిపిస్తారని కలలు కన్నారు. ఆ కలలన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. ఇంకా సీమాంధ్రులను వెన్నుపోటు పొడిచిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఎవరినీ ప్రజలు క్షమించలేదు. వీరిని ఇప్పుడే కాదు.. ఎప్పుడూ గెలిపించరు. వీళ్లంతా పదవుల మీద ఆశలు పెట్టుకోకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటే బెటర్ అని సీమాంధ్రులు అనుకుంటున్నారు.

అధ్యక్షురాలిగా ఓటమి బాధ్యత నాదే: సోనియా

      సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కు దేశవ్యాప్తంగా మొత్తం మీద సుమారు 60 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్‌లోని మొత్తం 543 సీట్లుండగా కాంగ్రెస్‌ పార్టీ 498 స్దానాలకు మాత్రమే పోటీ చేయగా అందులో విజయం సాదించింది కేవలం 60 స్దానాల్లోనే. నరేంద్రమోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ దెబ్బకు కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతైపోయింది. అయితే అధ్యక్షురాలిగా పార్టీ ఘోర పరాజయానికి తానే బాధ్యత వహిస్తున్నానని సోనియా గాంధీ తెలిపారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడపే ప్రభుత్వం దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఆశిస్తున్నట్లు సోనియాగాంధీ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో భాగమేనని, ప్రజల నిర్ణయాన్ని తాము సగౌరవంగా అంగీకరిస్తున్నామని అన్నారు.

సీమాంధ్రులను తెగ తిట్టినోళ్ళు మటాష్...

  టీఆర్ఎస్‌ వాళ్ళు సీమాంధ్రులను తిట్టారంటే అది వాళ్ళ ఉద్యమ వ్యూహంలో భాగంలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సీమాంధ్రులను అవమానకరంగా అనేకసార్లు మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన సీమాంధ్రులను దారుణంగా అవమానించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీలు పడ్డారు. కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా పనిచేస్తున్న వారు కూడా తమ స్థాయి మరిచి సీమాంధ్రులను అవమానించారు. అలాంటి వాళ్ళందరూ ఈ ఎన్నికలలో మటాషైపోవడం సీమాంధ్రులకు చాలా సంతోషం కలిగిస్తున్న అంశం. సీమాంధ్రులు ఎంతగానో గౌరవించే జైపాల్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోవాలని కోరిక పుట్టి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి తెలంగాణ ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ నాయకత్వ మీద ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆయనే ఈ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయారు. మల్కాజిగిరిలో ఓడిపోయిన సర్వే సత్యనారాయణ, కేంద్ర మంత్రిగా వున్న బలరాం నాయక్, ఎంపీ మధు యాష్కి, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ రాజయ్య.. ఇలాంటి వాళ్ళందరూ తెలంగాణని అడ్డం పెట్టుకుని సీమాంధ్రులను తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు సీమాంధ్రుల కళ్ళు కొంత చల్లబడ్డాయి.

కాంగ్రెస్‌కి తెలుగోడి ఉసురు తగిలింది

  కాంగ్రెస్ పార్టీకి తెలుగోడి ఉసురు తగిలింది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, ఢిల్లీలో తెలుగోడిని పిచ్చోడిని చేసి ఆడించిన కాంగ్రెస్ పార్టీ తెలుగోడి ఉసురు తగిలి సర్వనాశనమైపోయింది. గత ఎన్నికలలో అత్యధిక పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తెలుగోడు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నాడు. తెలుగోడు కోరుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సర్వనాశనం అయిపోయింది. ప్రాంతాలు వేరైనా అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో తెలుగువాడు కాంగ్రెస్ పార్టీ అంతు చూశాడు. తెలంగాణ ఇచ్చాం అని చంకలు గుద్దుకున్నా, సీమాంధ్రని బాగుచేసేస్తాం అని మొసలి కన్నీరు కార్చినా కాంగ్రెస్ పార్టీని తెలుగోడు క్షమించలేదు. తన కడుపు మంటని ఓటు కాగడాగా మార్చి కాంగ్రెస్ పార్టీ చితికి నిప్పంటించాడు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓడిపోయినా బుద్ధి తెచ్చుకోకుండా అయిదేళ్ళ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళ ఆశలు నిరాశగా మార్చడానికి తెలుగువాడు ఎప్పుడూ సిద్ధంగా వుంటాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో వినిపించకుండా వుండటానికి కృతనిశ్చయుడై వున్నాడు.

ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: మన్మోహన్ సింగ్

  ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని శనివారం మాజీ ప్రధాని కాబోతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు.15వ లోక్‌సభను రద్దు చేయాలన్న కేబినెట్‌ ఈరోజు తీర్మానం చేయనున్న నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితం తెరచిన పుస్తకమని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి, పదేళ్ల యూపీఏ పాలనకు బాధ్యత వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యకర్తలు చేశామన్నారు. దేశానికి చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. వచ్చే ప్రభుత్వానికి విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో భారత్‌ సూపర్‌శక్తిగా తయారుకావాలని అన్నారు. ప్రధానికి ఇదే తన చివరి మీడియా సమావేశమని ఆయన స్పష్టం చేశారు.

సీమాంధ్ర ఎంపీలు

  సీమాంధ్ర ఎంపీలు   1. శ్రీకాకుళం: కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ) 2. విజయనగరం: పూసపాటి అశోక్ గజపతి రాజు (టీడీపీ) 3. కాకినాడ: తోట నరసింహం (టీడీపీ) 4. అరకు: కొత్తపల్లి గీత (వైసీపీ) 5. విశాఖ: కె.హరిబాబు (బీజేపీ) 6. అనకాపల్లి: ముత్తంశెట్టి శ్రీనివాసరావు (టీడీపీ) 7. అమలాపురం: డాక్టర్ రవీంద్రబాబు (టీడీపీ) 8. రాజమండ్రి:  మాగంటి మురళీమోహన్ (టీడీపీ) 9. నర్సాపూర్: గోకరాజు గంగరాజు (బీజేపీ) 10. ఏలూరు: మాగంటి వెంకటేశ్వరరావు (టీడీపీ) 11. విజయవాడ: కేశినేని నాని (టీడీపీ) 12. మచిలీపట్నం: కొనకళ్ళ నారాయణ (టీడీపీ) 13. గుంటూరు: గల్లా జయదేవ్ (టీడీపీ) 14. నరసరావుపేట: రాయపాటి సాంబశివరావు (టీడీపీ) 15. బాపట్ల: మాల్యాద్రి శ్రీరామ్ (టీడీపీ) 16. ఒంగోలు: వై.వి.సుబ్బారెడ్డి (వైసీపీ) 17. నెల్లూరు: మేకపాటి రాజమోహన్ రెడ్డి (వైసీపీ) 18. కడప: వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ) 19. నంద్యాల: ఎస్.పి.వై.రెడ్డి (వైసీపీ) 20. కర్నూలు: బుట్టా రేణుక (వైసీపీ) 21. రాజంపేట: పి.మిథున్ రెడ్డి (వైసీపీ) 22. అనంతపురం: జేసీ దివాకరరెడ్డి (టీడీపీ) 23. హిందూపురం: నిమ్మల కిష్టప్ప (టీడీపీ) 24. తిరుపతి: వరప్రసాదరావు (వైసీపీ) 25. చిత్తూరు: డా. ఎన్.శివప్రసాద్ (టీడీపీ)

రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ విజేతలు

  '     రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ. 1. మేడ్చెల్ - ఎం.సుధీర్ రెడ్డి (తెరాస) 2. మల్కాజిగిరి - రామచంద్రరావు (బీజేపీ) 3. కుత్బుల్లాపూర్ - కె.పి.వివేకానందగౌడ్ (టీడీపీ) 4. కూకట్ పల్లి -  మాధవరం క్రిష్ణారావు(టీడీపీ) 5. ఉప్పల్ -  ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ) 6. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీడీపీ/బీజేపీ) 7. ఎల్బీనగర్ - ఆర్.క్రిష్ణయ్య (టీడీపీ) 8. మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి (టీడీపీ) 9. రాజేంద్రనగర్ - ప్రకాష్ గౌడ్ (టీడీపీ) 10. శేరిలింగంపల్లి -  ఆరికపూడి గాంధీ (టీడీపీ) 11. చేవెళ్ళ(ఎస్సీ) - కె.యాదయ్య (కాంగ్రెస్) 12. పరిగి - టి.రామ్మోహనరెడ్డి(కాంగ్రెస్) 13. వికారాబాద్ (ఎస్సీ) - బి.సంజీవరావు (తెరాస) - 14. తాండూరు - మహేందర్ రెడ్డి (తెరాస)

మహబూబ్ నగర్ జిల్లా అసెంబ్లీ విజేతలు

      మహబూబ్ నగర్ జిల్లా గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.   1.కొడంగల్ -  కె.రేవంత్ రెడ్డి (టీడీపీ) 2. నారాయణపేట్ -  కె.శివకుమార్ రెడ్డి (తెరాస) 3. మహబూబ్ నగర్ - వి.శ్రీనివాస గౌడ్ (తెరాస) 4. జడ్చర్ల -  సి. లక్ష్మారెడ్డి (తెరాస) 5. దేవరకద్ర - ఎ.వెంకటేశ్వర రెడ్డి (తెరాస) 6. మక్తల్ - సి.రామమోహనరెడ్డి (కాంగ్రెస్) 7. వనపర్తి - జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) 8. గద్వాల్ - డి.కె.అరుణ (కాంగ్రెస్) 9. అలంపూర్ (ఎస్సీ) -  ఎం.శ్రీనాథ్ (తెరాస) 10. నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధనరెడ్డి (తెరాస) 11. అచ్చంపేట (ఎస్సీ) - జి.బాలరాజ్ (తెరాస) 12. కల్వకుర్తి - చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్) 13. షాద్ నగర్ - వై.అంజయ్యయాదవ్ (తెరాస) 14. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు  (తెరాస)

హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు

    హైదరాబాద్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ. 1. ముషీరాబాద్ - డా.కె.లక్ష్మణ్ (బీజేపీ) 2. మలక్ పేట - అహ్మద్ బలాల (ఎంఐఎం) 3. అంబర్ పేట - కిషన్ రెడ్డి (బీజేపీ) 4. ఖైరతాబాద్ -సీహెచ్.రామచంద్రారెడ్డి (బీజేపీ) 5. జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాధ్ (టీడీపీ) 6. సనత్ నగర్ -  తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ/బీజేపీ) 7. నాంపల్లి - జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 8. కార్వాన్ - కౌసర్ మొహిద్దిన్ (ఎంఐఎం) 9. గోషామహల్ - టి.రాజాసింగ్ (బీజేపీ)  10. చార్మినార్ - అహ్మద్ పాషాఖాద్రి (ఎంఐఎం)   11. చాంద్రాయణగుట్ట -  అక్బరుద్దీన్ ఓవైసీ 12. యాకుత్ పుర - ముంతాజ్ ఖాన్ (ఎంఐఎం) 13. బహదూర్ పుర - మోజం ఖాన్ (ఎంఐఎం) 14. సికింద్రాబాద్ -  పద్మారావు (తెరాస) -   15. కంటోన్మెంట్ (ఎస్సీ) - సాయన్న (టీడీపీ)

కంగ్రాట్స్ మోడీ: రజనీకాంత్ ట్విట్

      ఎన్నికల ముందు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఎన్నికలలో బీజేపీ, ఎన్డీయే ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు. ఈమధ్యే ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన రజనీకాంత్ మోడీకి తన అభినందనలను కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నరేంద్ర మోడీ జీ.. చారిత్రక విజయం సాధించిన మీకు హ‌ృదయపూర్వక అభినందనలు’’ అని ట్విట్ చేశారు. పనిలో పనిగా తమిళనాడులో భారీగా పార్లమెంట్ స్థానాలు గెలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా రజనీకాంత్ అభినందనలు తెలిపారు.