ఐటి సోదాల్లో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడడం ఇదే తొలిసారి...

  కల్కి ఆశ్రమంలో అక్రమాలు బయట పడుతున్నాయి, కల్కి భగవాన్ ముసుగులో జరుగుతున్న దందా లెక్కలు విప్పుతున్నారు ఐటి అధికారులు. బుధవారం నుంచి ఆశ్రమంలోనే ఐటీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు వెయ్యి ఎకరాల భూమి ఉన్నట్టు లెక్క తేల్చారు, దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయల నగదును గుర్తించారు. అందులో తొమ్మిది కోట్ల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు, ఐటి సోదాల్లో ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడడం ఇదే తొలిసారి. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు ముప్పై చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో ఏకంగా ఆశ్రమంలోనే ఐటీ అధికారులు నిన్నటి నుంచి మకాం వేశారు. వరదయ్యపాలెం మండలం, ఉబ్బలమడుగు, బీఎన్ కండ్రిగ మండలంలోని కల్కి ఆశ్రమానికి చెందిన నాలుగు క్యాంపస్ లలో సోదాలు జరుగుతున్నాయి. భక్తుల విరాళాలు పక్కదారి పడుతున్నాయని, ఆదాయ పన్ను కట్టడం లేదని భారీగా ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగం లోకి దిగారు. తొలి రోజు ఐటీ సోదాల అనంతరం వారు అక్కడే ఉన్నారు, రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. మొత్తం నాలుగు వందల మంది అధికారులు పదహారు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఆశ్రమ ఆదాయ కార్యకలాపాలూ, ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా సోదాలు జరుపుతున్నారు. వరదయ్యపాలెం ఆశ్రమం ప్రధాన ద్వారం మూసి వేశారు, పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల్లోని కల్కీ ఆశ్రమాలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కల్కి భగవాన్ కృష్ణాజీ దంపతులు, సీఈవో లోకేష్ దాసాజీ లను అధికారులు విచారిస్తున్నారు. తొలి రోజు ఆశ్రమం నుంచి ముప్పై మూడు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమ నిర్వాహకులు భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి, ఆ సొమ్ముతో భూముల కొనుగోలు, డిపాజిట్ లు దుర్వినియోగమవుతున్నట్టు తమిళనాడు ఐటి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఐటి అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఏక కాలంలో దాడులకు దిగింది. మొత్తం పదహారు బృందాలుగా ఏర్పడి నలభై చోట్ల ఏక కాలంలో తనిఖీలు జరుపుతున్నారు. బుచ్చినాయుడు కండ్రిగ వరదయ్యపాళెం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలకు విదేశీ భక్తులు భారీగా వస్తుంటారు, కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ ఆయన సతీమణి ప్రీతిజి పర్యవేక్షణలో ఆశ్రమాలు, సేవా మందిరాలు నడుస్తున్నాయి. కృష్ణాజీ నిర్వహిస్తున్న ఇతర కంపెనీల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశాల నుంచి కల్కి ట్రస్టుకు అందిన విరాళాలపై ప్రత్యేక దృష్టి సారించారు ఐటి అధికారులు. పైగా మూడేళ్ళుగా కల్కి ఆశ్రమ ఆదాయ పన్ను ఎగ్గొట్టిందని కూడా ఫిర్యాదులు అందాయి.  

తగ్గుముఖం పట్టిన నైరుతీ ఋతు పవనాలు,సకాలంలో ప్రవేశించిన ఈశాన్య ఋతు పవనాలు......

  నిన్న మొన్నటి దాకా భారీ వర్షాలతో రాష్ట్రాలంతా అతలాకుతలమైపోయాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వాగులు,వంకలు నిండి వరదల్లతో ఎకంగా ఊర్ల సైతం నీట మునిగాయి.ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నైరుతి ఋతు పవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి అనే తెలుకోవచ్చు. అదే సమయంలో తమిళనాడుకి ఆనుకుని ఉన్న ఆంధ్రా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య ఋతు పవనాలు ప్రవేశించాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల రాకతో ఇప్పటికే ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నిన్న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఒక్క రోజులోనే డెబ్బై పాయింట్ తొమ్మిది సగటు వర్షపాతం నమోదైంది. దక్షిణ తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురవ వచ్చని, దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారీ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. భారీగా వర్షాలు కురిశాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది చాలా ఆలస్యంగా నైరుతి ఉపసంహరణ జరిగింది. మరోవైపు ఈశాన్య ఋతు పవనాలు ఏడాది సకాలంలో విస్తరించనున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈశాన్య ఋతు పవనాలు అక్టోబర్ ఇరవై ఏడు లోపు ప్రవేశించనే లేదు.    

ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ...

  ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రాంనగర్ దగ్గర ప్రారంభించి సిటీలో అన్ని డిపోలను కలుపుతూ ర్యాలీ చేయాలనుకుంది జీఏసీ కానీ, సభలకు, ర్యాలీలకు అనుమతులు లేని కారణంగా వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థులు నిర్వహించ తల పెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ముందస్తుగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్ధిలందరినీ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి స్థాయి ఉద్రిక్తల మధ్యనే బైక్ ర్యాలీ ఆగిపోయింది, మరల బైక్ ర్యాలీ నిర్వహించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. అయితే పోలీసుల బందోబస్తు రాంనగర్ చౌరస్తా వద్ద పెరిగింది. ఏ ఒక్కరైనా ఆర్టీసీకి సంబంధించి స్లోగన్స్ ఇచ్చినా లేకపోతే ప్లకార్డులతో ప్రదర్శించినా కూడా అరెస్టు చేసి తీసుకెళ్లి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి అప్పజెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం రాంనగర్ చౌరస్తాలో మాత్రమే కాకుండా రాంనగర్ చౌరస్తాకి వస్తున్న దారిలో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. రాంనగర్ కు కలిసిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నిటిలో కూడా పోలీసులు గస్తీ కాస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అనుమతులు లేవంటూ ఆపేయాలని ఇప్పటికే పోలీసులు హెచ్చరించడం జరుగుతోంది. మీడియాతో కార్మికులు మాట్లాడుతూ, ఆత్మబలిదానాలు చేసుకోవద్దు అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది కోర్టులు కూడా చెప్తున్నాయి కానీ, తమ సమస్యలు తీర్చేవారు లేరని కాబట్టి ఖచ్చితంగా పోరాడి తమ హక్కుల్ని సాధించుకుంటాం అని అన్నారు. అయితే ప్రస్తుతం రాంనగర్ వద్ద  ప్రశాంత వాతావరణం నెలకొంది.  

మీడియా తో వ్యవహరించాల్సిన తీరు పై మంత్రులకు భోదించిన జగన్.....

    ఏపీలో మీడియాతో వ్యవహరించాల్సిన తీరు పై మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ కర్తవ్య బోధ చేశారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగింపు దశలో మీడియా గురించి వారికి సీఎం కీలకమైన సూచనలు చేసినట్టు తెలిసింది. వైసీపీకి చంద్రబాబు ఒక్కరే శత్రువు కాదని, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వంటి మీడియా సంస్థలతోనూ నిరంతరం పోరాటం చేయాలని జగన్ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ మంత్రులతో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. 'అక్కడక్కడా కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయని ఏదైనా ఉంటే తాను మీడియాను పిలిచి మాట్లాడతానన్నారు సీఎం. నూట యాభై మందిలో సమర్థులైన వారిని మంత్రులుగా ఎంపిక చేశానని అందరితో తనకు స్నేహపూరితమైన సంబంధాలు ఉన్నాయని, ఆయనకి ఎవరినైనా మధ్యలోనే  తొలగించాలంటే బాధగానే ఉంటుందని చెప్పుకొచ్చారు జగన్ . మంత్రులెవ్వరూ కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దని వారు ఎక్కడ ప్రలోభాలకు లొంగిపోవద్దని హెచ్చరించారు. ఇదే సందర్భంగా మీడియా నిరంతరం మన చుట్టే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇతర మీడియా సంస్థలు మనపై నిఘా పెట్టాయని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రుల్లో ఎవరిపైనైనా ఆరోపణలు చేస్తూ మీడియాలో కథనాలు వస్తే తన పై ఒత్తిడి పెరుగుతుందని పిలిచి మాట్లాడాల్సి వస్తుందని ఆయన తెలిపారు'. ప్రతిపక్షనేత చంద్రబాబు నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించినట్టు తెలిసింది. ప్రతిపక్షం చేసే విమర్శలు, ఆరోపణలు మీడియాలో వస్తున్న, ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై మంత్రులూ, ఎమ్మెల్యేలూ తీవ్రంగా స్పందించి గట్టి సమాధానం చెప్పాలని సూచించారు. ఇటీవల ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం వల్లే ఎండీ సురేంద్రబాబును ప్రభుత్వం బదిలీ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి రాసింది. ఈ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో పరిశీలించాలని సూచించారు. ఇలాంటి కథనాలు భవిష్యత్తులో పునరావృతమైతే కేసులు పెట్టి వాటి సంబంధిత శాఖల కార్యదర్శుల పై చర్యలు తీసుకోవుటకు ఏ మాత్రం వెనకాడవద్దని ఆదేశించారు. వెంటనే ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయండి అని సీఎం చెప్పినట్టు  సమాచారం.

త్వరలో తెరపడనున్న 134 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న అయోద్య వివాదం...

  అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, నూట ముప్పై నాలుగు ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదానికి త్వరలో తెరపడనుంది. నవంబర్ 17 లోగా తుది తీర్పు రానుంది, చివరి రోజు కూడా అత్యున్నత న్యాయస్థానంలో వాడి వేడిగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో అయోధ్య వివాదంపై వాదనలు ముగిశాయి, ఇక తీర్పు పైనే అందరి కళ్ళు ఉన్నాయి, నలభై రోజుల పాటు కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ వాదనలు సాగాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం విషయంపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయ్యింది. వాదనల చివరి రోజు సర్వోన్నత న్యాయస్థానంలో హైడ్రామా చోటుచేసుకుంది. విచారణలో భాగంగా హిందూ మహాసభ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకాన్ని కోర్టు ముందుంచగా, సున్నీ వర్క్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాన్ని సమర్పిస్తే చించేస్తామని హెచ్చరించారు. అయినా వికాస్ సింగ్ తన వాదనలు వినిపిస్తుండగా రాజీవ్ ధావన్ జోక్యం చేసుకొని ఆ పుస్తకాన్ని చించేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని చింపటాన్ని సమర్ధించుకున్నారు సున్నీ వర్క్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్. చీఫ్ జస్టిస్ అనుమతి తోనే అలా చేసినట్టు స్పష్టం చేశారు. అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకాన్ని కిషోర్ గుణాల్ రచించారు. వివాదస్పద స్థలంలో రామ మందిరం ఉందని, దీనికి సంబంధించిన మ్యాప్ ను కూడా పుస్తకంలో పెట్టారు. అయితే ఈ పుస్తకాన్ని సాక్ష్యంగా తీసుకోవాలన్న పిటిషన్ ను న్యాయస్థానం రెండు వేల పద్ధతులనే తోసిపుచ్చిందన్నారు ముస్లిం సంస్థలు తరపు న్యాయవాది రాజీవ్ ధావన్. సున్నీ వర్క్ బోర్డు తరఫున ఆయన తుది వాదనలు వినిపించారు, అయోధ్యలో వివాదాస్పద స్థలంపై హిందు సంస్థల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయన్నారు ధావన్. అక్కడ ఆలయం ఉందని హిందూ సంస్థలు నిరూపించలేక పోయాయి అని అన్నారు. నాలుగు వందల ఏళ్ల నుంచి వివాదస్పద స్థలంలో మసీదు ఉన్నట్టు ఆధారాలున్నాయని చెప్పారు. ఆ స్థలాన్ని సున్నీ వర్క్ బోర్డుకు అప్పగించాలని డిమాండ్ చేశారు

గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికుల నేతలు.....

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మే పదమూడవ రోజుకు చేరింది. ఒకపక్క ఉప ఎన్నికలు ఉత్కంఠం మరోపక్క ఆర్టీసీ సమ్మేతో కేసీఆర్ తీవ్ర ఒత్తిడికి లోనైతున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.హైకోర్ట్ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ రెండు రోజుల్లో చర్చలు జరిపి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మండి పడింది. సమ్మే పై ఒకొక్కరు ఒకొక్క విమర్శలు చేస్తున్నారు. కొందరు నేతలు సమ్మేకి  మద్దత్తు కూడా తెలుపుతున్నారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల కార్యకర్తలు గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. సీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అటు నిర్మల్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కార్మికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అదుపు లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సు సర్వీసును పునరుద్ధరించారు. జయశంకర్ భూపాలపల్లి ఆర్టీసీ డిపో దగ్గర కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్ లకు దండం పెడుతూ విధులకు రావొద్దని వేడుకున్నారు. తమ పొట్టకొట్టవద్దని కుటుంబ సభ్యులతో సహా వచ్చి కోరారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.ఇక ఈ సమ్మే ఎప్పటికి ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి.    

హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసిఆర్ హాజరు కానున్నారా?

  తెలంగాణ సీఎం పైనే అందరి చూపులు.ఒక పక్క హుజుర్ నగర్ ఎన్నికల ప్రచారం,మరోపక్క ఆర్టీసీ సమ్మే. ఈ గండాలను కేసీఆర్ ఎలా దాటతారోనని అందరిలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. పార్టీ అధినేత కేసీఆర్ క్యాంపెయిన్ లో చొరవ చేసుకునే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎన్నికల సంఘం నిఘా, మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె హుజూర్ నగర్ సభకు కేసీఆర్ హాజరు అవ్వాలో వద్దో తేల్చుకోలేని స్థితి  కల్పించారు. హుజూర్ నగర్ లో నేడు అధికార టీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు పై ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు సీఎం వస్తారా రారా అని వారం రోజులుగా స్థానికంగా చర్చ జరగుతోంది. ఉప ఎన్నికల్లో వ్యయం పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించడమే ఇందుకు కారణం. ఎన్నికల సంఘం షాడో బృందాలు ఈ నియోజకవర్గంలో ప్రత్యేక నిఘా వేశాయి. ఈ నేపథ్యంలో సభకు కేసీఆర్ హాజరైతే అభ్యర్థిపై ఎన్నికలపై వ్యయ ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బహిరంగ సభకు సుమారు యాభైవేలమంది హాజరవుతారని మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో వారిని తరలించేందుకు అయ్యే ఖర్చంతా టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సైదిరెడ్డి ఎన్నికల ఖర్చు నిబంధనలోకి వచ్చే అవకాశముంటుంది.ముఖ్యమంత్రి ఇక్కడికి హెలికాప్టర్లో వచ్చి వెళ్ళినందుకు సభావేదిక నిర్మాణం, నిర్వహణకు ఇతర వాహనాలకు అయ్యే ఖర్చులన్ని ఎన్నికల వ్యయం కిందకు వస్తాయి. వీటిలో కొన్ని ఖర్చులు టిఆర్ఎస్ ఖాతాలోకి మరి కొన్ని స్టార్ క్యాంపెయిన్ వర్గం అయిన సీఎం ఖాతాలోకి వెళ్తాయి. ఎన్నికల వ్యయం నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరుస రోడ్ షోలు కూడా రద్దయినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మి కుల సమ్మె కొనసాగుతుండటంతో సీఎం సభలో కార్మికులెవరైనా నిరసన తెలపడం వంటి ఘటనలు జరిగితే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు. దీంతో కేసీఆర్ రాకపై ఉత్కంఠ నెలకొంది.మరోవైపు అధికారులు మాత్రం సీఎం కేసీఆర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మాత్రం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కేసీఆర్ వస్తారా రారా అన్నదే అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.    

మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ వ్యూహం ఏమిటి?

  మోదీ ఏ పని చేసినా అందులో ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు మోదీ దృష్టి మొత్తం మహారాష్ట్ర ఎన్నికల పైనే ఉంది  .లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయంతో జోష్ మీదున్న ప్రధాని మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు కొత్త ఫార్ములాలను తెరపైకి తెస్తున్నారు. నరేంద్రుడు, దేవేంద్రుడి కాంబినేషన్ లో అద్భుతాలు ఖాయమని గత ఐదేళ్లలో ఆ సంగతిని నిరూపించి చూపామని మోదీ అంటున్నారు. దేవేంద్రుడు అంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. గడిచిన ఐదేళ్ల పాలనలో దేవేంద్రుడి పాలనను అందరూ మెచ్చుకున్నారని అందుకే ఆయనకు మరో ఐదేళ్లు ఇవ్వబోతున్నారని మోదీ వెల్లడించారు. తాను, దేవేంద్రుడు ఒకే చోట నుంచుంటే అది వన్ ప్లస్ వన్ టూ అని కాకుండా ఎలవెన్ అని చెప్పాల్సి ఉంటుందన్నారు. మహారాష్ట్రలో పలు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ఓటర్లను ఉత్తేజపరిచే ప్రసంగాలు చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ పాలనలో మహారాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఆయన సంక్షేమ పథకాలు సజావుగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ సంపద వృద్ధి చెందడంలో మహారాష్ట్ర కీలక భూమిక పోషించిందన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు ప్రస్తావించకూడదని కాంగ్రెస్ ను మోదీ నిలదీశారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వని విపక్షాలు సిగ్గుతో చచ్చిపోవాలని ఆయన అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు ఎన్సిపికి కుటుంబ సంక్షేమం మాత్రమే అవసరమని వారికి జమ్మూ కశ్మీర్ తో పాటు దేశం పై మక్కువ లేదని మోదీ ఆరోపించారు. ఇక ఓటమి భయంతోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతకాలం ప్రచారానికి రాలేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సెటైర్ లు వేశారు. ఇప్పుడు కూడా రాహుల్ ప్రచార సభలకు జనం రానివ్వడం లేదని అన్నారు. ఎక్కడ రాహుల్ సభలు జరిగితే అక్కడ ప్రత్యర్ధులకు భారీ మెజారిటీ వస్తుందని ఫడ్నవిస్ అంటున్నారు. తమ రాష్ట్రంలో ఫలితాలు ఏక పక్షంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.మెల్లమెల్లగా ఇతర పార్టీ నేతలు కూడా కాషాయ తీర్ధాన్ని పుచ్చుకుంటున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే బుధవారం బీజేపీలో చేరారు. తన పార్టీ మహారాష్ట్ర స్వాభిమాన పక్షకు బిజెపిలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజులుగా బీజేపీ నుంచి వచ్చే పిలుపు కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. రాణేకు మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఫడ్నవిస్ పని తీరు నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు రాణే చెప్పుకొన్నారు.ఇకమహారాష్ట్ర ఎన్నికలు జోరుగా సాగుతాయన్న సమాచారం.    

సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల సంరక్షణకై హరిష్ రావు ప్రత్యేక శ్రద్ద

మనం ఒకప్పుడు విన్న  డైలాగ్   ఇప్పుడు  కళ్ళ ముందు  కనిపిస్తుంది మొక్కె కదా అని పీకేస్తే పీక తెగుద్ది ఇది ఓ పాపులర్ సినిమా లోని డైలాగ్ ఇప్పుడు సిద్దిపేటలో ఇదే జరుగుతుంది. కాకపోతే పీక తెగకుండా మొక్క పీకితే జేబులు ఖాళీ కావచ్చు, జైలుకు వెళ్లవచ్చు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎవరు ధ్వంసం చేసిన అనుమతి లేకుండా కొమ్మలూ నరికిన మొక్కలకు అమర్చిన ట్రీగార్డు ఎత్తుకెళ్లిన జరిమానాలు విధిస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సిద్దిపేటలో ఇప్పటికే జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణకు సిద్దిపేటలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హార్టికల్చర్ అధికారులు ఆకస్మిక తనిఖీలను చేపడుతున్నారు. మొక్కల సంరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తొలగించిన సదరు వ్యక్తులపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు, జరిమానాలు విధిస్తున్నారు. మొక్క, చెట్టు ఏజ్ ను బట్టి వెయ్యి నుంచి గరిష్ఠంగా ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో మొక్కల నరికిన దాదాపు పదిహేను మందికి జరిమానాలు విధించారు. వీరిలో కొందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ముఖ్యంగా పట్టణాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మొక్కలు నరికిన వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డుపై లేదా డివైడర్లపై మొక్కలూ చెట్లూ పడిపోయి ఉన్న ట్రీగార్డులు ఎత్తుకెళ్లిన, ఎంక్వైరీ చేసి మరీ జరిమానాలు విధిస్తున్నారు.ఇప్పటిదాక జరిమానాల ద్వారా దాదాపు నలభై వేల రూపాయలు మునిసిపల్ అకౌంట్ లో జమ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల రక్షణకు అనుక్షణం తపిస్తున్నారు. చెట్టు పడింది కనపడటం లేదా అంటూ అక్కడే నిలదీస్తారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పర్యటిస్తున్న హరీశ్ రావు పాత బస్టాండ్ కరీంనగర్ రోడ్డులో ఒక షాపు ముందు పడి ఉన్న చెట్టును గమనించి కారులోంచి దిగి నేరుగా షాపు యజమాని దగ్గరికి వెళ్లారు. ఏం బాబు చెట్టు కింద పడింది కనబడటం లేదా షాపు ఓపెన్ చేసేటప్పుడు చెట్టును చూడలేదా రోజు ఉన్న చెట్టు లేదని గమనించలేదా చెట్టంటే అంత నిర్లక్ష్యమా అని షాపు యజమానిని నిలదీశారు. అక్కడే ఉండి అతనితో కింద పడిన మొక్కను కర్రతో కట్టించి సరి చేపించారు. మన ప్రాణం ఎంతో మొక్క ప్రాణం అంతే అని మరోసారి మొక్కను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ శాఖలను కూడా ఆయన వదిలిపెట్టటం లేదు. ఇటీవల సిద్దిపేట నుండి సీతారాంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వెళ్తూ పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో చెట్లను నరకడం గమనించిన హరీశ్ రావు కారులోంచి దిగి చెట్ల కొమ్మలు తీసేస్తున్న విద్యుత్ లైన్ మెన్ పై సీరియస్ అయ్యారు. విద్యుత్ డీఈ, ఏఈలపై ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మొక్కలు నాటుతూ పోతే మీరు నరుక్కుంటూ పోతారా అని సీరియస్ అయ్యారు. శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించి చెట్లను సంరక్షించాలని సూచించారు. చెట్లను నరకొద్దు ఇబ్బందిగా ఉన్న కొమ్మలను కట్ చేయాలి తప్ప గొడ్డలిపెట్టి నరకొద్దు. మొక్కలు తీసేస్తే చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మొత్తమ్మీద హరితహారం కార్యక్రమంతో సిద్దిపేటని హరితవనంగా మార్చడానికి అటు హరీశ్ రావు ఇటు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.  

అవినీతి అధికారుల మధ్య లెక్క తేలని వాటాలు,వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు......

  కష్టపడి పని చేసే శ్రామికుల వేతనాలు అధికారుల చేతి వాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. చివరకు వాటాల్లో తేడా వచ్చే సరికి అక్రమార్కుల బండారం బైటపడింది. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్న మొన్నటివరకు కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాత్రమే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు పారిశుధ్య విభాగానికి కూడా పాకే రోజంతా శ్రమించి పని చేసే కార్మికుల జీతాలను కూడా స్వాహా చేయడం మొదలు పెట్టారు కొందరు అధికారులు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వాటా పంపకాల్లో తేడా రావడంతో చివరకు అవినీతి పుట్ట కదిలింది. విజయవాడ నగర పాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు మూడు వేల మంది డ్వాక్రా సభ్యులు పనిచేస్తున్నారు. వీరికి ఇరవై నెలల క్రితం వరకూ పది వేల రూపాయల వేతనం చెల్లించేవారు. ఇరవై నెలల కిందట కార్మికుల జీతాన్ని పదకొండు వేల రూపాయలకు పెంచారు. జీతమైతే పెంచారు కానీ వాటిని అమలు చేయకుండా కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్కో కార్మికుడికి ఇరవై వేల వరకు వేతన బకాయిలు చెల్లించాల్సి వుంది. అందరికీ కలిపి ఇరవై నెలలకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల క్రితం మొత్తం వేతన బకాయిలు యాభై శాతం అంటే మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. కొంత మంది అవినీతి అధికారులు కుమ్మక్కై ఈ నిధుల్లో ముప్పై లక్షల వరకు పక్కదారి పట్టించారు. వాస్తవంగా పని చేసే కార్మికుల కన్నా రికార్డుల్లో ఎక్కువ సంఖ్య ను చూపి నిధులను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చాయి. దీనికి చెక్ పెట్టేందుకు కార్మికులకు ఐరిష్ హాజరును ప్రవేశపెట్టారు దీన్ని సైతం తప్పు దారి పట్టించేలా రికార్డు సృష్టించారని సమాచారం. కేవలం రికార్డుల్లో మాత్రమే ఉండి క్షేత్ర స్థాయిలో లేని కార్మికులకు ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జీతాలు డ్రా చేశారు.  ఇప్పుడు వారి వేతన బకాయిలను కూడా చడీచప్పుడూ లేకుండా స్వాహా చేసేందుకు పథకం వేసుకున్నారు. అదే సమయంలో అవినీతి అధికారుల మధ్య వాటాలు పంచుకోవడంలో విబేధాలు తలెత్తాయి. ఇప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం కాస్త కమిషనర్ దృష్టికి వెళ్లింది. కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కమిషనర్ రహస్యంగా విచారణ జరిపారు. నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణ లో వాస్తవం ఉందని నిర్థారించుకున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారి కి షోకాజ్ నోటీస్ తో పాటు విభాగం సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యను తీసుకోబోతోందో వేచి చూడాలి.

ఆ అధికారి అక్రమ ఆస్తులు చూసి షాకైన  ఏసీబీ అధికారులు!!

  అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్న, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలుకు పంపిస్తూ, అవినీతికి పాల్పడితే ఏ విధమైన గతి పడుతుందో ఏసీబీ అధికారులు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఏసీబీ టీమ్ అవినీతికి పాల్పడుతున్న జిల్లా అధికారులను ట్రాప్ చేయడం చాలా చర్చ నీయాంశంగా మారాయి. ఈ పది రోజుల్లోనే ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులను ట్రాప్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు గుర్తించారు.  గత నెలలో ఓ కేబుల్ ఆపరేటర్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ లో మార్కెటింగ్ మేనేజర్ అయిన రామచంద్రను లక్షా యాభై వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న శివప్రసాదరావుని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రావడంతో ఇతని ఇళ్ల పై దాడులు నిర్వహించారు. రాయలసీమ రీజియన్ లోని అతిపెద్ద కేసుగా అధికారులు తెలిపారు. శివ ప్రసాద్ ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారాన్ని అలాగే బెంగుళూరులో సుమారు మూడు కోట్లు విలువ చేసే జి ప్లస్ సెవన్ అపార్ట్ మెంట్, హైదరాబాద్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్, బెంగళూరులోనే రెండు కోట్ల విలువ చేసే మరో బిల్డింగ్, హైదరాబాద్ లోని గాజుల మల్లారంలో ఒక కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు. ఇవికాక తన భార్య పేరుతో మరో రెండు యాక్సి ట్రీ హోటల్ ప్రైవేటి కంపెనీ, సీండ్రీస్ అనే రెండు సూట్ కంపెనీలను వాడుతున్నారు.మనీ ట్రాన్సక్షన్ కోసం యుగాండాలో బ్యాంక్ ఎకౌంట్ తెరిచాడు.  ఇక రెండ్రోజుల క్రితం ఓ రైతు నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంజామల తహసీల్దారు గోవింద్ సింగ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నిన్న ఎమ్మార్వోకు సంబంధించిన ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా భారీగా నగదు, స్థిర, చరాస్తులు, ఫిక్సెడ్ డిపాజిట్లు బయటపడటంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. గోవింద్ సింగ్ పని చేసిన ప్రతిచోటా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న గోవింద్ సింగ్ లాకర్ లో పదహారు లక్షల ముప్పై రెండు వేల నగదు, పదిహేను లక్షలు విలువ చేసే నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం, కోటి రూపాయల విలువ చేసే ఫిక్సిడ్ డిపాజిట్లు. అతని భార్య బ్యాంక్ లాకర్ లో ఇరవై ఆరు లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, జైలు పాలు కావాల్సిందే. ఓ వైపు ఏసీబీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తమ తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.

నెల్లూరు జిల్లాల్లో పార్టీ ఓటమికి అసలు కారణాలు తెలుసుకుని షాక్ అయిన చంద్రబాబు.....

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి పై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టారు. తూర్పు గోదావరితో మొదలైన ఈ పర్యటన విశాఖ, నెల్లూరు జిల్లాలో కొనసాగాయి. రెండు రోజుల పాటు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజక వర్గాల వారీగా సమీక్ష కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో జరిగింది. ఇదంతా ఒకెత్తయితే నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని చంద్రబాబు నేతలు అడిగారు. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. పార్టీ ఇంతగా నష్టపోవటానికి కారణాలు ఏంటి అని నేతలను సూటిగా చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారు. అయితే కొంత మంది నేతలు మాత్రం మనసు విప్పి మాట్లాడారు. పార్టీ అధిష్టానం పరంగానే తప్పులు జరిగాయని తప్పులన్నీ మీరే చేసి మమ్మల్ని అడగటం బాగోలేదని కొందరు వాదనలు వినిపించారు. కొన్ని నియోజకవర్గాలు అభ్యర్ధులను మార్చాలనీ ఎన్నికల ముందు పదేపదే చెప్పినా పట్టించుకోలేదని ఏక పక్షంగా అభ్యర్ధులను నిర్ణయించి తమపై రుద్దారని కొందరు కార్యకర్తలు వాపోయారు. ఇప్పుడు తాము వద్దన్నా నేతల్లో పోటీలోకి దించి వారు ఓడిపోతే తమనడగటం బాలేదని అన్నారు. సూళ్లూరుపేటలో వైసీపీకి అరవై ఒక్క వేల మెజార్టీ ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెంటనే జోక్యం చేసుకొని క్యాండిడేట్ ను మార్చమని పదేపదే విజ్ఞప్తలు చేసినా పట్టించుకోలేదని దాని ఫలితమే అరవై ఒక్క వేల మెజార్టీ అని చెప్పారు. ఎన్నికల ముందు రిజల్ట్ ఊహించి చెప్తే అధిష్ఠానం పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం సూచనలకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయారు. అధిష్టానం తప్పులు చేసి ఇప్పుడు సమీక్షల పేరిట తాము తప్పు చేశామని కలరింగ్ ఇవ్వడం బాగోలేదని సమావేశంలో కార్యకర్తలు కుండ బద్దలు కొట్టారని తెలుస్తుంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పరంగా సపోర్ట్ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాలు వస్తే పక్క పార్టీ చెంత చేరటానికి  నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ముందే కొందరు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నెల్లూరు సమీక్ష సమావేశాలు వాడీవేడిగా జరిగాయని తెలుస్తోంది. ఇవి విన్న చంద్రబాబు ఇక పై ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి. 

ఆ ఊర్లో చేసే వృత్తే ఆ ఊరి పేరుగా మారింది...

  ఆ ఊర్లో అందరిదీ ఒకటే వృత్తి ముసలి వాళ్ళ నుంచి నేటి యువతరం వరకు ఆ వృత్తే వారికి జీవనోపాధి. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు కూడా తాత ముత్తాతల నుంచి వచ్చిన పనినే వారసత్వంగా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వృత్తే ఆ ఊరి పేరైంది, సంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లి గ్రామంలోని జనాభా ఆరు వందలు. ఇక్కడి నివాసాలు నూట యాభై కానీ, అందరూ చేసే పని మాత్రం ఒక్కటే అదే భవన నిర్మాణాల పని. ఇల్లు, కార్యాలయం, గోడౌన్, ఫ్యాక్టరీ ఇలా ఏది కట్టాలన్నా ఇక్కడ ఆయా రంగాలకు సంబంధించిన కార్మికులు, మేస్త్రీలు ఎల్లంపల్లిలో దొరుకుతారు. సుతారి, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టైల్స్, సెంట్రింగ్ ఇలా అన్ని రకాల వర్కర్ లు మేస్త్రీలకు పెట్టింది పేరు ఈ ఊరు. ఎల్లంపల్లిలో అన్ని కుటుంబాలు ఒకే వృత్తి నేర్చుకోవడం వల్ల చాలా మంది ఎల్లంపల్లిని మేస్త్రీల పల్లి అని కూడా పిలుస్తారు. ఏ సీజన్ లోనైనా తమ ఉపాధికి ఇబ్బంది ఉండదంటారు గ్రామస్తులు. ఇంట్లో నలుగురుంటే కనీసం ఒక్కరైనా భవన నిర్మాణ పని చేస్తారు, ఉన్నత చదువులు చదివిన యువకులు కూడా తాతలు తండ్రుల నుంచి వచ్చిన వృత్తినే కొనసాగిస్తున్నారు. కొందరు ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వలస వెళ్తే మరికొందరు సమయాన్ని వృథా చేయకుండా వ్యవసాయం లేదంటే భవన నిర్మాణ పనులకు వెళుతున్నారు, మహిళలు ఇవే పనులకు వెళుతున్నారు. భవన నిర్మాణ పనులకు ఎల్లంపల్లి ఫేమస్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లి ఇక్కడి వాళ్లు పని చేస్తారు. బయట ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందిగా మారడం వల్ల సమీప ప్రాంతాల్లోనే పనులు చూసుకుంటున్నారు. మొదట్నుంచీ శ్రమను నమ్ముకుని బతుకుతున్న తమకు ఆశించిన మేర సంపాదన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే సివిల్ పనులను తమకిస్తే బయటకు వెళ్లి బతకాల్సిన అవసరం ఉండదంటున్నారు గ్రామస్తులు. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూపించాలని కోరుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచే శిక్షణ దిశగా పాలకులు చొరవ చూపాలని కోరుతున్నారు. భవన నిర్మాణ పనులనే నమ్ముకొని ఉన్న చాలా మందికి వయోభారం వల్ల కుటుంబాన్ని పోషించడం సమస్యగా మారిందంటున్నారు. ప్రభుత్వం ఇతర ఉపాధి అవకాశాలు చూపించాలని కోరుతున్నారు మేస్త్రీల పల్లి గ్రామస్థులు.

NATIONAL IDEATION DAY

Mission: To utilize the human potential of India to make India a developed country (Economical and Humanity) and make this world a better place. Vision: To make every Indian as problem solvers rather than problem cribbers. Background: India’s population will overtake China’s by 2028. India is the youngest country in the world with more than 65 percent population under 35 years of age. India’s population is a threat as well as an opportunity. Threat is when we are unable to create jobs to this huge youth population, the same youth will hit the roads and create chaos because they are not engaged in any work. Sadly, there are already a significant number of youngsters who have already taken up these activities on a regular basis. These are some of the effects if we don’t solve the problem of unemployment: 1) Political instability. 2) Civil unrest. 3) Exploitation of labour. 4) Industrial disputes. 5) Social problems. 6) Increase in poverty. 7) Loss of human resources. 8) Diversion of interests to easy money & crimes. 9) Migration of population to foreign countries. Opportunity is when we are able to create jobs to such huge population, India’s rise as a super power and developed country is just a formality as majority of population is engaged in some kind of meaningful work. How we can create jobs? The only way by which we create jobs is by putting seeds of ideas in minds of our youth and children. The people’s president Dr. Kalam famously said, “The ignited soul compared to any resource is the most powerful resource on the earth, above the earth and under the earth” The missile man has emphasized on the utilization of human potential for bolstering India’s development. Dr. Kalam represents a powerful Idea called as ‘DEVELOPED INDIA’. He envisaged Vision 2020. For him, developed India was not only about economic development but also about human values development. Can we achieve his vision 2020? It has already been 70+ years since independence and we are still miles away from being developed. India is blessed with abundant human resources. If we can tap these human resources for ideation, development will be an eventuality. Development is two-way exercise and is only possible if people actively reciprocate to the efforts put on to them by the government. Unfortunately, we still see people not reciprocating to the one of the finest initiatives ‘SWATCH BHARAT’. We still see people spitting and throwing litter on the roads. Then, how we can develop India? The thought of ‘IDEATION FOR DEVELOPMENT’ must be imbibed into the minds of people. Most people are looking for freebies in spite of having the capacity to come out of their distress through ideation. For a population whose mind is blunted by populism, the only saviour evident to them is the government. This thinking is prevailing in the majority of Indian Population. We request for your support on declaration of Dr. Kalam’s birthday (15th October) as ‘NATIONAL IDEATION DAY’. It will be a fitting tribute to this great man whose life was dedicated to the development of India. This declaration will create massive impact in this country. This single day will give a window to the people to think about the solutions through ideation about the problems in this country. This will pave a path for the shift from Populism to Self-Reliance. Few points on 'NATIONAL IDEATION DAY' 1) This idea will enable people to realize the power of ideation giving them self-belief that they can solve their own problems. 2) Schools, colleges, universities, and communities will participate and ideate the whole day which eventually brings out millions of ideas on that single day. 3) It will inculcate the spirit of entrepreneurship that will be pivotal for job creation. 4) Rewards and support can be given to the people sustaining their idea for more than a year. 5) Corporate, NGOs, and other social organizations can come up with workshops to encourage ideation among people. 6) Village panchayats can collaborate with the ideation teams & help bring out simple & economic ideas of the villagers on developing their localities. 7) Social media platforms can create a path for putting in new ideas, steps for economic schemes & promoting patents of individuals. 8) Skill development centres can help in raising the number of voluntary members regarding ideation & its sessions. Let the Kalam’s dream percolate to every nook and corner of this country through this ‘NATIONAL IDEATION DAY’. Declaration of this day will change the course of our history, inspiring numerous people to create wonders with their ideas and script the story of developed India. How NID works: 1)First the formal declaration of National Ideation day will make people to think about the concept of ‘National Ideation Day’ and how they can contribute their thinking for self and society development. We need to sprout the thinking in minds of people that their mind has potential to come up with ideas that can be useful and relevant. Declaration of National Ideation day will pave path to such thinking that will lay foundation for developed India that Dr.Kalam and majority of people dream of. 2) Involvement of Government machinery to communicate, allocate funds, and celebrate ‘National Ideation Day’ in all schools, colleges, universities and other relevant institutions in all across India. 3) Encouraging corporate to conduct ideation sessions in their campuses, schools and colleges. 4) Government can also declare rewards for the best ideas from each district to encourage people from all districts to participate in this Idea festival. Best ideas can also be given assistance from the government. The best idea rewards can also be declared in national, state, district, city, town, village, area, street, etc. level. The main purpose is to maximize the participation through rewards. 5) The problems that people can solve might be divided into different levels. It might be a local problem, state problem, national problem or international problem. Ideator can select any problem that he/she wants to solve 6) Bureaucrats, MLAs, MPs, Sarpanches, and other relevant public servants can conduct ideathons in their respective places. They can give relevant problems that the respective places are facing and can get solutions to those problems. 7) For state level, MLAs can discuss and come up with relevant problems that can be ideated upon by the people in the assembly. Those problems can be given to the public to come up with solutions. It applies the same to the country where Mps can discuss the problems that can be given to the public in the parliament and they can give those problems to get solutions from the public. Some of the works done by the Team National Ideation Day for the declaration of October 15th as National Ideation Day * Team NID met Sri Kishan Reddy, explained him thoroughly about the objectives and goals of National Ideation Day and sought his support * As the youth of our Nation play a prominent role in this, Team NID started ‘NIDinteract’ in which Team NID will visit certain educational institute and will explain staff and students of that institute “What NID is and how it works”. As a part of NIDinteract, we visited Bhavan’s Vivekananda College of Secunderabad and enlightened the students about the power of ideation and its role in the development of nation.   * Sri V.V. Lakshminarayana has been supporting NID since its beginning And will be launching a program “Dr.Kalam Innovation Festival” on October 15th, 2019 (on the occasion of Dr. Kalam’s Birth Anniversary)   * The idea of declaration of National Ideation Day is taken forward through the Non-profitable Organization called “Team Jatayu”. Team Jatayu is a Non-Governmental Organization run by a team of youngsters that mainly concentrates of social issues etc., Some of the activities of Team Jatayu include #StandForOrphans, #MenstrualAwareness, Support the affected people during Titili cyclone etc. Picture 1: Team Jatayu conducting Menstrual Awareness Program and distributing free sanitary napkins Picture 2: Team Jatayu took the responsibility of renovating a damaged room of a school Picture 3: Team Jatayu helping people who were affected by Cyclone Titili. Picture 4: Team Jatayus’s #StandForOrphans campaign Sign the Petition at http://chng.it/5j5Zfm58Vm A single powerful idea has the potential to create a million jobs; it doesn't matter where the idea is born from! Days like these give the thought about the power of an idea which can transform the country to accelerate faster towards development. Let’s build our nation through ideation. #JaiHind - Team National Ideation Day  

హోంగార్డ్ ల జీవితాలపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న యూపీ సర్కార్...

  యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరవై ఐదు వేల మంది హోంగార్డులను తొలగించింది. అదేమంటే బడ్జెట్ లేదని చెబుతున్న ప్రభుత్వ సమాధానం కలకలం రేపుతోంది. కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు జీతాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో బడ్జెట్ లేదని ఉద్యోగాలకే ఎసరు పెట్టింది యోగి సర్కార్. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. తగినంత బడ్జెట్ లేని కారణంగా దీపావళికి ముందే ఇంత భారీ సంఖ్యలో హోంగార్డులను తొలగించడం సంచలనమైంది. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి అధ్యక్షతన ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రయాగ్ రాజ్ లోని యూపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డు కూడా వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. గతంలో హోంగార్డులకు రోజుకు ఐదు వందల రూపాయల వేతనం చెల్లించేవారు. ఈ తీర్పుతో ఆ వేతనాన్ని ఆరు వందల డెబ్బై రెండు రూపాయలకు పెంచాల్సి వచ్చింది. బడ్జెట్ పరిమితంగా ఉన్న తరుణంలో ఇరవై ఐదు వేల మంది హోంగార్డు విధుల నుంచి రిలీవ్ ఆవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తొంభై తొమ్మిది వేల మంది హోమ్ గార్డుల పనిదినాలని సైతం తగ్గించింది. గతంలో ఇరవై ఐదు రోజులుగా ఉన్నవారి పనిదినాల్ని పదిహేను రోజులకు తగ్గించింది. దీంతో దీపావళికి ముందే వేలాది కుటుంబాలలో చీకట్లు అలుము కున్నటైంది.యూపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలకు బలైపోతున్న హోంగార్డ్ జీవితాలకు సమాధానం దొరుకుతుందో లేదో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో కమల దళం పుంజుకోనుందా?

  కాషాయ దళం ఏ పని చేసిన అందులో ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష తో పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంది. త్వరలోనే లోక్ సభ నియోజక వర్గాల వారీగా కొంతమంది బలమైన నేతలకు గాలం వెయ్యాలని లిస్ట్ ను సిద్ధం చేసుకుంది బీజేపీ. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పార్టీ పునాదులు వేసేందుకు సరి కొత్త ప్లాన్ లు వేస్తున్నారు నేతలు. ఆర్టీసీ కార్మిక సంఘాలలో పట్టు కోసం ఇప్పటికే బిజెపి నేతలు సమ్మెను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. సమ్మె ప్రారంభమైనప్పట్నుంచి బిజెపి నేతలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా కదులుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు ఇతర పార్టీ నేతలు కార్మికులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కార్మిక సంఘాల్లో ఇప్పటి వరకు వామపక్షాలు లేదా టీఆర్ఎస్ కు పట్టుంది. దీంతో లెఫ్ట్ కు కార్మిక సంఘాలలో చెక్ పెట్టాలనేది బీజేపీ ఎత్తుగడగా తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణి కార్మిక సంఘాల్లో కీలక నేత మల్లయ్యను పార్టీలో చేర్చుకుంది. అక్కడ పార్టీ కార్మిక సంఘాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను అదనుగా తీసుకొని తమ కార్మిక సంఘాన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సమ్మెను ఒక ఆయుధంగాబీజేపీ నేతలు వాడుకుంటున్నారని ఇతర పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో విస్తరణ కోసం బీజేపీ పాచికను విసురుతోంది. అయితే ఇవన్నీ ఫలిస్తాయా లేదా అనేది ఎన్నికలు వస్తేగాని తెలీదు. ఆ ఎన్నికలు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చూపించిన ప్రభావం బట్టి ఆ పార్టీ ఎదుగుదల ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.  

తీవ్రస్థాయికి చేరుకుంటున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం...

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగురవేయటానికి టీ.ఆర్.ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగిస్తుంది. గురువారం గులాబీ బాస్ కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. కేసీఆర్ సభతో సమీకరణాలు మారతాయని ప్రచారం సాగుతోంది. రెండు వేల తొమ్మిదిలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పడినప్పట్నుంచి అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. మూడు సార్లు ఉత్తమ్ కుమార్ విజయం సాధించారు, ఉత్తమ్ ఎంపీగా ఎన్నిక కావడంతో అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో టి.ఆర్.ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నాయి. హుజూర్ నగర్ ను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లోనూ ఇన్ చార్జిలను నియమించి ప్రచారం సాగిస్తున్నారు. ఈ నెల నాలుగో తేదీన టీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అన్ని మండలాల్లోనూ వరుసగా రోడ్ షోలు నిర్వహించాలని అనుకున్నా చివరికి కేటీఆర్ ప్రచారం రద్దైంది. ఇక గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లో కేసిఆర్ బహిరంగ సభ నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరాజయం పాలు చేసింది. ఆనాడు కేసీఆర్ చేసిన ప్రసంగం నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లు, సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు కూడా అదే విధంగా హుజూర్ నగర్ లో కేసీఆర్ సభతో టి.ఆర్.ఎస్ దశ తిరుగుతుందని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి. టి.ఆర్.ఎస్ విజయం తోనే నియోజక వర్గం అభివృద్ధి బాట పడుతోందని గులాబిదళాలు ఊరూరా ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ సభ రోజునే తమ అభ్యర్థి సైదిరెడ్డి విజయాన్ని ఖాయం చేసుకోవాలని టీ.ఆర్.ఎస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. విజయం కోసం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్న టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించింది. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఉధృత ప్రచారం సాగిస్తోంది. కేసీఆర్ సభలో కూడా హుజూర్ నగర్ కు పలు వరాలు ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ కు చెక్ పెట్టాలని టీ.ఆర్.ఎస్ గట్టిగా నిర్ణయించుకుంది అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది.

నేతన్నలకు 24వేలు... మత్స్యకారులకు 10వేలు... జగన్ సర్కారు సంచలన నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల కోసం వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తోన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా 24వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. డిసెంబర్ 21నుంచి వైఎస్సార్ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే, వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు 10వేలు చొప్పున ఆర్ధికసాయం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. అదేవిధంగా మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ మంత్రివర్గం... హోంగార్డుల రోజువారీ వేతనాన్ని 710 రూపాయలకు పెంచింది. దాంతో హోంగార్డుల నెల వేతనం 18వేల నుంచి 21వేల 300కి చేరనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్‌లో సభ్యత్వమున్న న్యాయవాదులకు నెలకు 5వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక, జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం... మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పలాస ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతి తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి... ప్రభుత్వమే హామీగా ఉండి... రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కములకు ఊరటనిచ్చేందుకు... 4వేల 471కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

బోటు చిక్కినట్లే చిక్కి చేజారింది... గోదావరిలో లంగరేసిన ధర్మాడి బృందం

గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి నెలరోజులు దాటిపోతున్నా, ఇంకా 13మంది ఆచూకీ దొరకకపోవడంతో... బోటును ఏదోవిధంగా బయటికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గోదావరిలో లంగరేసిన ధర్మాడి బృందానికి బోటు చిక్కినట్లే చిక్కి చేజారింది. బోట్ల వెలికితీతలో నైపుణ్యమున్న ధర్మాడి సత్యం బృందం... ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమైనా... అధికారులు మరోసారి అవకాశమివ్వడంతో... బోటును బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మూడ్రోజులుగా కచ్చులూరు దగ్గర ఆపరేషన్ చేపడుతోన్న ధర్మాడి సత్యం బృందం.... గణనీయమైన పురోగతి సాధించింది. ధర్మాడి టీమ్‌ వేసిన లంగరుకు బోటు చిక్కింది. అయితే, లంగరును లాగుతుండగా బోటు ముందుకు కదిలినా, అంతలోనే లంగరు పట్టు వదిలేసింది. లంగరుతో లాగడం వల్ల యాక్సిడెంట్ స్పాట్ నుంచి బోటు ముందుకు జరిగిందని ధర్మాడి సత్యం తెలిపారు. అయితే, నేరుగా లంగరు వేయగలిగితేనే బోటు బయటికి తీయగలగమని  ధర్మాడి సత్యం అంటున్నారు. నదీగర్భంలోకి వెళ్లి... నేరుగా బోటుకు లంగరు వేసేందుకు విశాఖ నుంచి గత ఈతగాళ్లను రప్పిస్తున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లతో నేరుగా బోటుకు లంగరు వేయగలిగితే విజయం సాధించినట్లేనని, అది సాధ్యంకాకపోతే.... ప్రొక్లైన్‌ సాయంతో ఆపరేషన్ చేపడతామని ధర్మాడి సత్యం అంటున్నారు.